http://www.deccanchronicle.com/channels/nation/south/naidu-writes-singh-meet-telangana-718
Avoiding taking a stand on Telangana and attempting to fix the Congress, Telugu Desam president N. Chandrababu Naidu on Wednesday asked the Centre to convene an all-party meeting to end the deadlock on giving statehood for the region.
Contrary to expectations that the TD would finally take a stand on Telangana, Mr Naidu, in his letter to Prime Minister Manmohan Singh late on Wednesday night, put the ball in the Centre’s court and asked it to resolve the issue at the earliest.
Mr Naidu’s letter — which comes ahead of the September 30 T-march and his own padayatra starting on October 2 — may not cut much ice since he failed to take a stand on Telangana statehood. The TD has previously performed flip-flops on the Telangana issue.
After extending support to Telangana in a letter to then finance minister Pranab Mukherjee, and asking the Centre to take a decision on statehood, he joined hands with the TRS for the 2009 polls and even wore a pink khandwa. However, he made an about-turn after Union minister P. Chidambaram announced the initiation of the process for carving out a separate Telangana on December 9, 2009.
YS JAGAN HAD NO ROLE IN VANPIC CASE: CBI TO HC
http://sakshipost.com/index.php/news/state/3833-ys-jagan-had-no-role-in-vanpic-case-cbi-to-hc
http://www.tupaki.com/news/view/Problems-Started-For-TDP-Chief-ChandrababU-Naidu/13417
byreddy out
resigned from tdp
praveen is next
hope fully they dont change their decession
we need not think about cbn and tdp
becoz, cbn will see that everybody leaves tdp and he and son remain in it
thats the strategy of chakram tippina babu
please dont under estimate opponent anytime
jagan first should bring that bolli babu to groud
Another MLA amarnath Reddy from Chittuor is also ready to leave the party … Hope some more MLA may follow this …
తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లావాడే కావడం విశేషం. అది కూడా చంద్రబాబునాయుడు పక్క నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఎన్.అమరనాధ రెడ్డి కావడం ప్రత్యేకతగా తీసుకోవాలి.ఇప్పటికే తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించి, తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.అదే బాట అమరనాధ్ రెడ్డి కూడా తాను సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల పార్టీ దెబ్బతింటోందని అన్నారు.అమరనాధ్ రెడ్డి గతంలో పుంగనూరుకు, ఆ తర్వాత పలమనేరుకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఈయన తండ్రి కూడా రామకృష్ణారెడ్డి కూడా టిడిపి పక్షాన ఎమ్మెల్యే, ఎమ్.పిగా బాధ్యతలు నిర్వహించి దివంగతులయ్యారు. ప్రవీణ్ కాని, అమరనాద్ రెడ్డి కాని రాజకీయ కుటుంబాలకు చెందినవారే కావడం విశేషం. వీరే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇంకెవరైనా తిరుగుబాటు చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/jagan-not-forger-cbi-723
now a day’s sakshi website is not at all working properly.
U are right there seems to be some technical problems with Sakshi website recently. Hope thay correct it soon.
లేఖ చిచ్చు: బాబుపై టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య
చిత్తూరు: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు రాసిన లేఖపై ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. టిడిపి తంబళ్లపల్లి శాసనసభ్యుడు ప్రవీణ్ రెడ్డి గురువారం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా గతంలో రాసిన లేఖను తమ పార్టీ అధ్యక్షుడు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే టిడిపి పేరును తెలంగాణ దేశంగా పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మార్చ్ అంటే సీమాంధ్రులపై పరోక్షంగా సీమాంధ్రులపై దాడి జరిపుతున్నట్లే అన్నారు. అలాంటి మార్చ్కి తమ సహచర తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతివ్వడం దారుణమన్నారు. తెలంగాణపై పార్టీ ఇచ్చిన లేఖను నిరసిస్తూ తాను ఆయన నిర్వహించబోయే పాదయాత్రలో తాను నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. లేఖను ఉపసంహరించుకోకుంటే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు.
రాయలసీమవాసి అయి ఉండి బాబు ఇలా చేయడం సరికాదన్నారు. టిడిపి అంటే తెలంగాణ దేశం పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. 2009 తర్వాత పార్టీ అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. నాటి నుండి తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని తప్పుడుగానే ఉన్నాయని మండిపడ్డారు. గతంలో తీసుకున్న నిర్ణయాల నుండి మొదలు తెలంగాణ నిర్ణయం వరకు అన్ని తప్పిదాలే అన్నారు. బాబు నిర్ణయాల వల్లనే టిడిపి ఇలా తయారయిందని ఆరోపించారు.
పాదయాత్ర లోగా లేఖను ఉపసంహరించుకోకుంటే తన సహకారం ఉండదని, పైగా నిరసన తెలుపుతానన్నారు. తనకు పార్టీని వీడాలని లేదని, అయితే తనకు పార్టీ భవిష్యత్తు కంటే రాష్ట్ర భవిష్యత్తు ఇంకెంతో ముఖ్యమన్నారు. సీమాంధ్రలో దాదాపు అందరూ సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు సగం మంది అదే కోరుకుంటున్నారని చెప్పారు. బాబుపై తన సొంత జిల్లాలో వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. ఆయన నిర్ణయాలు అన్నీ పార్టీకి నష్టమే అన్నారు.
http://amruthamathanam.blogspot.in/
http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=89516
భోరున ఏడ్చిన పిల్లలకు ఏమని చెప్పేది?…
అసలు మా మామగారు చేసిన తప్పేంటి?
మన రాష్ర్టం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని తాపత్రయపడటమే తప్పా? రాష్ట్రంలో పూరిగుడిసె ఉండకూడదు అనుకోవడం తప్పా? పేదవాళ్లు బాగా చదువుకోవాలని, మంచి వైద్యం చేయించుకోవాలని, గుజరాత్.. తమిళనాడు.. మహరాష్ట్రలను తలదన్నే వృద్ధిరేటు ఉండాలని కోరుకోవడం, దాని కోసం రేపు లేదన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేయడమేనా ఆయన చేసిన తప్పు?
మొన్న 14వ తారీఖున జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో హియరింగ్కు వచ్చింది. అది వచ్చే నాటికి జగన్ జైలులో ఉండబట్టి 110 రోజులు. సిబిఐ వాళ్లు వేసిన కౌంటర్ ఫైల్ చూశాను. వాళ్లిచ్చిన అన్యాయమైన లీకులు చూశాను. వాళ్లకు వంతపాడిన పత్రికలను, టివి చానెల్స్ను చూశాను. వాళ్ల సహ కుట్రదారులైన రాజకీయనాయకుల మాటలు విన్నాను. నాకు అనిపించింది -వీళ్లకు ఎందుకు ఇంత కక్ష, ఇంత పగ అని. ఒక మనిషిని ఎదుర్కొనడానికి ఇంత కథ, స్క్రీన్ ప్లే, డెరైక్షన్ అవసరమా? ఇంత ప్లానింగ్తో… ఇంతగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంత తెలివిగా చేస్తున్నామనుకొని ఒకరి భుజాలు మరొకరు చరుచుకుంటూ ఉండటం అవసరమా?
కాని మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడట. మన తెలివితేటలను మూర్ఖత్వంగా మార్చగల దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయారు. ఆరోజు మా పిల్లలు భోరున ఏడ్చారు… ‘ఇంకెన్ని రోజులు అమ్మా… ఎందుకింత అన్యాయంగా మనలను ఇబ్బంది పెడుతున్నారు’ అని ఏడ్చారు. పిల్లలు ఏడ్చారని మేము చెప్పినప్పుడు మామూలుగా ఎంతో నిబ్బరంగా ఉండే జగన్ చాలా కలత చెందాడు. పిల్లలకు చెప్పు ధైర్యంగా ఉండమని… దేవుని దయ వలన నాన్న ఆశీర్వాదంతో త్వరగా వస్తానని చెప్పు అన్నాడు. మేము ఏం చేశామని మాకీ శిక్ష?
జగన్ ఒక ఎంపీగా ఉన్నాడా… ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడా… ఒక మంత్రిగా ఉన్నాడా… ఒక ఆఫీసర్గా ఉన్నాడా… అసలు మా మామగారు చేసిన తప్పేంటి? మన రాష్ర్టం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని తాపత్రయపడటమే తప్పా? రాష్ట్రంలో పూరిగుడిసె ఉండకూడదు అనుకోవడం తప్పా? పేదవాళ్లు బాగా చదువుకోవాలని, మంచి వైద్యం చేయించుకోవాలని, గుజరాత్.. తమిళనాడు.. మహరాష్ట్రలను తలదన్నే వృద్ధిరేటు ఉండాలని కోరుకోవడం, దాని కోసం రేపు లేదన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేయడమేనా ఆయన చేసిన తప్పు? ఆయన ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నది వాస్తవం కాదా? ఆయన ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సంతృప్తిగా ఉన్నది నిజం కాదా? ఆయన అహర్నిశలు శ్రమించినందుకా ఆయన కుటుంబానికి ఈ క్షోభ? ఈ శిక్ష?
న్యాయంగా అయితే సిబిఐ ‘చట్టప్రకారం వాళ్లకి బెయిలు రావలసి ఉంటే, వాళ్ల హక్కులకు మేము అడ్డుతగలం’ అని చెప్పవలసింది పోయి, అంతగా పట్టుపట్టి ఎట్టి పరిస్థితులలోనూ న్యాయం జరగకూడదు అని పంతంతో వ్యవహరిస్తూ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు – ఇది నిష్పక్షపాతంగా కాదు, ముమ్మాటికీ ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా జరుగుతున్న విచారణ – అని.
కాని మన దేశంలో న్యాయం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తున్నదనే నమ్మకం నాకుంది. తప్పక జగన్కు న్యాయం జరుగుతుంది. బెయిల్ వస్తుంది.
నాకు భయమేసినప్పుడల్లా దేవుడిని, మా మామగారిని తలుచుకుంటాను నేను. ఆయన ఎంతోమంది ఆడబిడ్డలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. కష్టాలలో వాళ్లను ఆదుకున్నారు. ఆయన వాళ్లను ఆదుకున్నట్టు దేవుడు నన్ను, మా అత్తను ఆదుకుంటాడు. ఆయన చేసిన మంచి ఊరికే పోదు. అది తప్పకుండా మాకు దీవెన ఇస్తుంది. దేవుడి దయవలన జగన్ తప్పకుండా త్వరలో బయటికి వస్తాడు. మామను ప్రేమించే ప్రతి గుండె జగన్ను ఆదరిస్తుంది.
జగన్ ఆరోజు నల్లకాలువలో అన్నాడు – నాన్న నాకొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు- అని. నిజమే… అధికారంలో ఉండేవాళ్లు, కుళ్లు కుట్రలు మనసులో ఉంచుకొని పైకి సమాజంలో నీతి మాటలు పలుకుతూ పెద్ద మనుషుల్లా చలామణి అయ్యేవాళ్లు మాకు విరోధులుగా ఉండవచ్చు. గులాంనబీ ఆజాద్గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా – ‘జగన్ మా పార్టీలో ఉండి ఉంటే తనను కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తర్వాత తనను ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం’ అన్నారు. ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా గుండెను పిండుతున్నంత బాధ అనిపిస్తుంది. అంటే తను వాళ్ల మాటలు వినలేదు కాబట్టి, ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు కాబట్టి, అందరూ కలిసి ఇంత కుట్రచేసి అన్యాయంగా జైలుకు పంపించారు. వీళ్లు ఈ సమాజంలో పెద్ద మనుషులు!
కాని రాష్ట్రంలోని ప్రతి పేద అవ్వ – తాత, ప్రతి అన్న – చెల్లి, ప్రతి తమ్ముడు – అక్క తోడు ఉన్నంత వరకు, పైనుండి దేవుడి చల్లని దయ, మామగారి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ పెద్దమనుషుల కుట్రలు, కుతంత్రాలు దూదిపింజల్లా తేలిపోతాయి. వానలా వెలిసిపోతాయి. జగన్ త్వరలో మనందరి మధ్యా ఉంటాడు.
జగన్ కేసు- సిబిఐ వాదనలో బలహీనత
వాన్ పిక్ భూముల కేటాయింపుతో జగన్ కు సంబంధం లేదని సిబిఐ న్యాయవాది హైకోర్టు వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం సంచలనంగా మారింది.ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్ కు భూ కేటాయింపులతో సంబందం లేనప్పుడు ఆయన కంపెనీలలో పెట్టుబడులలో తప్పేమిటన్న సందేహం సహజంగానే వస్తుంది.దీనిపై హైకోర్టు న్యాయమూర్తి కూడా తనకు కూడా కొన్ని సందేహాలు వస్తున్నట్లు వ్యాఖ్యానించడం విశేషంగా కనిపిస్తుంది.ఇంతవరకు వాన్ పిక్ భూముల కేటాయింపునకు, జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబందం ఉందని సిబిఐ వాదిస్తూ వచ్చింది. అయితే సిబిఐ వాదన ప్రకారం జగన్ పేరు ఇందులో ప్రస్తావన తెచ్చినా, అసలు అభియోగం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై మోపాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. ఆయన ఎటూ లేరు కనుక ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ను ప్రధాన నిందితుడిగా చేశారు. అయితే తండ్రి చేసిన తప్పులకు కొడుకు బాధ్యత ఎలా వహిస్తారన్న ప్రశ్న వస్తుంది. అంతేకాక అసలు వాన్ పిక్ ప్రాజెక్టు సంబందించి ఏడెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేయడం పెద్ద తప్పన్నట్లుగా సిబిఐ వాదిస్తోంది.ఒకపక్క మంత్రి దర్మాన ప్రసాదరావు అన్నిటికి క్యాబినెట్ ఆమోదం ఉందని చెబుతోంటే, సిబిఐ అందుకు భిన్నంగా వాదిస్తోంది. అలాంటప్పుడు ధర్మానను అరెస్టు చేయడానికి సిబిఐ ఎందుకు ప్రయత్నం చేయలేదో అర్దం కాదు.ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాదన వినడానికి సిబిఐ కూడా ఎందుకు ప్రయత్నం చేయలేదో తెలియదు. రాజకీయ కేసుగా మారిన ఈ వ్యవహారంలో సిబిఐ అప్రతిష్టను తెచ్చుకునేలా ఉంది.దీనివల్ల రాష్ట్రానికి కూడా నష్టం జరగవచ్చు.పెట్టుబడులు పెట్టేవారు వెనుకంజ వేయవచ్చు. ఒకవేళ నిజంగానే నిబందనలకు విరుద్దంగా భూ కేటాయింపులు జరిగితే, దానిని రద్దు చేసి భూమిని తీసుకోవచ్చు కదా. అప్పుడు నష్టపోయేది పెట్టుబడిదారుడే కదా. దానిని వదలిపెట్టి ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయడం, బెయిల్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించడం.. ఎంతకాలం సిబిఐ ఈ రకంగా చేస్తుందో తెలియదు.
http://www.thehansindia.info/epaper.asp?edition=0&page=1