బాబూ.. ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచెయ్

ఎమ్మెల్యేలను కొనటం కాదు…
ప్రజల్లోకి వెళ్లి ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం
టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోనే ఉన్నారు.. తగినంతమంది రాగానే మీడియాకు చెబుతాం..
ఆ తర్వాత గంటలోనే ప్రభుత్వం కూలుతుంది..
టీడీపీ పాలనపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

చంద్రబాబు మంత్రివర్గ సమావేశాలు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదు…కొని నా దగ్గరకు ఇంకా ఎందుకు తీసుకు రావడం లేదు… తెలంగాణలో కేటీఆర్‌ను, హరీశ్‌రావును చూసి బుద్ధి తెచ్చుకోండి అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. అంతెందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయండి, ప్రజల్లోకి పోదాం. నేను చాలెంజ్ చేస్తున్నా…నువ్వు గెలిచే సమస్యే లేదు, నువ్వు గెలుస్తావో… మేం గెలుస్తామో… ప్రజలే తీర్పు ఇస్తారు’ అని జగన్ అన్నారు.

పాలమూరు – రంగారెడ్డి పథకాన్ని ఆపండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణం ఆపాలి. మేం గవర్నర్‌కు విన్నవించిన నాలుగు ప్రధానాంశాల్లో ఇదొకటి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లే రావు. ఇక ఆ తరువాత ఉన్న నాగార్జునసాగర్‌కు కూడా నీళ్లుండవనే విషయాన్ని గవర్నర్‌కు వివరించాం. ఈ రెండు ప్రాజెక్టుల కింది ఆయకట్టుదారులంతా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని ఆపాలని కోరాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు ఆపడానికి గట్టిగా కృషి చేయాల్సింది పోయి ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడ్డం లేదు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికి పోయిన చంద్రబాబు ఆ కేసుల నుంచి బయటపడటం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రాజీ పడిపోయి రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెట్టారు.

వైఫల్యాలు దాచి.. మాపై నిందలు

టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రతిపక్షంపై బురద జల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. తునిలో జరిగిన రైలు దహనం సంఘటన, అక్కడ జరిగిన పరిణామాలన్నింటిపైనా ప్రస్తుత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, లేదా సీబీఐతో గాని విచారణ జరిపించాలని ఆయనను కోరారు. అపుడే వాస్తవాలు వెల్లడై నిజమైన నిందితులెవరో తేలుతుందన్నారు. కొద్ది నెలల క్రితం చిత్తూరు నగర మేయర్ అనూరాధ దంపతుల హత్య జరిగినపుడు తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నప్పటికీ సొంత పార్టీ వారే ఈ నేరం చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ వారికి ఆ హత్యను ఆపాదించే యత్నం చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష మందికి పైగా పాల్గొంటున్న సభకు ఏమాత్రం భద్రతా ఏర్పాట్లు చేయకుండా వైఎస్సార్‌సీపీపై నిరాధారమైన ఆరోపణలు చేయడంతో పాటుగా బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. తునిలో ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన సభ సందర్భంగా అక్కడ తగినన్ని పోలీసు బలగాలే లేవన్న విషయం గవర్నర్ దృష్టికి తెచ్చారు. 2014లో అధికారం చేపట్టిన దగ్గరి నుంచీ టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను, ఎంపీలు, ఎమ్మెల్యేలను భయకంపితులను చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో జరిగిన మూకుమ్మడి హత్యాకాండపై సరైన దర్యాప్తు చేయక పోవడం, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన సంఘటనపై దర్యాప్తు జరగక పోవడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చారు.

గవర్నర్ నోటితోనే అబద్ధాలు చెప్పిస్తున్నారు

శాసనసభా సమావేశాల సందర్భంగా చేసే ప్రసంగంలో మీ చేతే అబద్ధాలు చెప్పిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలపై మీ నోటితోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోంది. మేమిచ్చే వివరాలు, సమాచారం కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాం. చంద్రబాబు ఎన్నికల వేళ పూర్తిగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. రూ. 87,612 కోట్ల రైతు రుణాలను, రూ.14 వేల కోట్ల డ్వాక్రా మహిళలను రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. ఈ రెండూ కలిపితే రూ. 1,00,200 కోట్లు అవుతుంది. ఈ మొత్తంపై వడ్డీయే రూ 30,000 కోట్లు అవుతుంది. కానీ రెండు దఫాల్లో చంద్రబాబు ఇచ్చిన రూ. 7,300 కోట్లు వడ్డీలో నాలుగో వంతుకు కూడా సరిపోదు. కానీ ఆయన మాత్రం అన్నీ మాఫీ చేసేశానని చెబుతున్నారు.

http://www.sakshi.com/news/hyderabad/several-tdp-mlas-in-touch-with-ysrcp-says-ys-jagan-mohan-reddy-314877?pfrom=home-featured-stories

9 Comments

Filed under Uncategorized

9 responses to “బాబూ.. ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచెయ్

  1. YS Fan

    The biggest challenge faced by ycp since its inception is during the 16 month time jagan was in jail. Our supporters morale was never down during that 16 month period. We have successfully crossed that challenge/problem. Losing 2014 / Bhuma leaving ycp is nothing compared to that challenge. I am least bothered about this issue. Cheer up guys.We are on our road to victory in 2019

  2. Kammati jeevithalu ……

    http://www.sakshi.com/news/district/chandrababu-fair-bargain-of-corruption-315642?pfrom=home-top-story

    Konni janthuvulakanna viluvalu vuntayi kani …kondhari manushulaku ?
    Finally they die from cancer taking neither their caste itch nor their money with them ?

  3. Veera

    2011-14 మద్య 22 మంది TDP MLA లు ప్రతిపక్ష TDPని వదిలి వెళ్లారు
    2014-16 లో 10 మంది తెలంగాణా TDP MLA లు ప్రతిపక్ష TDPని వదిలి వెళ్లారు
    ఒకరిద్దరు వెళితే పోయేదేమిలేదు తమ్ముడూ !!!

  4. Veera

    విజయవాడ కంటే సింగపూర్ లో వ్యాపారం చేయడం ఈజీ-బాబు
    అనుభవం మరి, బినామీ ఆస్తులు వ్యాపారాలు అన్నీఅక్కడేగా రాజా-పోసాని

  5. Veera

    అబ్బబ్బ ఏమి సెపితిరి ఏమి సెపితిరి !!!
    (చేయాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఉంది 3 శంఖుస్థాపనలు
    తాల్లాయ పాలెం లో భూమి పూజ , ఉద్దండరాయపాలెం లో శంఖుస్థాపన వెలగపూడిలో తాత్కాలిక రాజధాని ఏమిటో???
    -తెలకపల్లి రవి, ప్రముఖ విశ్లేషకులు , NTV KSR LIve Show, Feb 19)

  6. Veera

    విశాఖ ప్రజాభిప్రాయం !!!
    ఈ నెల 8 న BC మిత్రుడు పని మీద విశాఖ వెళ్లారు అక్కడ 8 మంది తో మాట్లాడాడు.
    నలుగురు ఆటోవాళ్ళు, ఒక మెడికల్ షాప్, ఒక కిరానా షాప్ , అయన దిగిన లాడ్జి లో రిసెప్షనిస్ట్ మరియు బాయ్
    8 మంది బాబు ను తిట్తారట, ఒక్కరు కూడా కనీసం ఫర్వాలేదు అని కూడా చెప్పలేదు ఆట.
    మెడికల్ షాప్ అతను అయితే అసలు హుదూద్ డబ్బు మొత్తం తినేసాడు బాబు ఈ నేవీ వాళ్ళ వలన కొంచెం కోలుకున్నాము అని చెప్పాడట
    ప్రభుత్వ పాలన ఘోరంగా గా ఉంది అని చెప్పారట అంతా!!!

  7. Veera

    ఆశ దోశ అప్పడం-వెంకయ్య నాయుడు, రామోజీ ఉండగా BJP ని ఎదగనిస్తారా?
    (TDPతో పొత్తు వద్దంటున్న తెలంగాణా BJP నేతలు- BJP MLC రామచంద్ర రావు)
    [తెలంగాణ లో టిడిపి వద్దంటున్న బిజెపి నేతలు
    హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో చేదు అనుభవం నేపధ్యంలో వచ్చే ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై తెలంగాణ బిజెపి నేతలు చర్చించారు.గ్రేటర్ లో ఎదురైన అనుభవాన్ని కూడా సమీక్షించారు.ఈ సందర్భంగా టిడిపితో పొత్తు వదలుకోవడం బెటర్ అని పలువురు బిజెపి నేతలు అబిప్రాయపడ్డారు.ఓటుకు నోటు కేసు, ఆ తర్వాత పరిణామాలలో టిడిపితో పొత్తు వల్ల బిజెపికి నష్టం జరిగిందని వారు భావించారు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో టిడిపితో పొత్తు వద్దని బిజపి నేతలు భావిస్తున్నారని చెప్పారు.అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు స్థానికంగా ఉన్న నేతలతో మాట్లాడి నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
    http://kommineni.info/articles/dailyarticles/content_20160218_32.php?p=1455789904266 ]

  8. Veera

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం వలన శ్రీశైలం ప్రాజెక్ట్ కు 120 TMC ల నీళ్ళు రావు దీనివలన పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కు, నాగార్జున సాగర్ ద్వారా కృష్ణ డెల్టాకు అటు ఖమ్మం, నల్గొండకు తీరని నష్టం, సీమ ఇప్పటికే ఎడారి లాగా ఉంది ఈ విషయములో నిన్న గవర్నర్ కు జగన్ కంప్లైంట్ చేయడం కరెక్టు .ఇప్పటికైనా బాబు దీన్ని సీరియస్ గా పట్టించుకోవాలి, కేంద్రం ద్వారా సమస్య పరిష్కరించాలి
    ప్రజల్లో TDP పట్ల బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి YCP నుంచి పెద్దగా ఎవరూ పోరు మహా అయితే కేసుల ఇబ్బంది ఉన్న ఆదినారాయణ రెడ్డి లాంటి ఒకరిద్దరు వెళతారు
    -కాంగ్రెస్ తులసిరెడ్డి, NTV

  9. Veera

    జగన్ జగన్ జగన్-నిద్రలో కూడా కలవరిస్తున్ననిప్పు
    1.రాజధాని పంట పొలాలను తగలపెట్టించింది జగనే-బాబు అండ్ కో
    (కాదు TDP వాళ్ళే అని రైతులు చెప్పారు -వడ్డే శోభనాద్రీస్వర రావు,TDP మాజీ మంత్రి )
    2.చిత్తూర్ మేయర్ దంపతుల హత్య వెనక జగన్ హస్తం -బాబు అండ్ కో
    (కాదు మేయర్ దంపతుల మేనల్లుడే హంతకుడు-పోలీస్)
    3.తుని రైలు కాల్చింది సీమ కు చెందిన జగన్ మనుషులే-బాబు అండ్ కో
    (ఈస్ట్ గోదావరి , గుంటూర్ వాళ్ళను అరెస్ట్ చేసిన పోలీస్)
    4.AP లో ఏ చెడు జరిగినా జగన్ ఖాతాలో వేయాలి అనేది ప్రభుత్వ పాలసీ
    -జర్నలిస్టు కృష్ణారావు
    Note:క్రైమ్ రేట్ లక్ష జనాభాకు గుంటూరులో 620, కృష్ణాలో 623, కడపలో 182.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s