నల్లేరు పై ‘ఫిరాయింపు’ కాదు

జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు కు క్యాడర్ సెగ
కలిసిరామని తెగేసిచేబుతున్న కార్యకర్తలు
అటుTDP లోనూ అసమ్మతి జ్వాలలు

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5126074

22 Comments

Filed under Uncategorized

22 responses to “నల్లేరు పై ‘ఫిరాయింపు’ కాదు

  1. 12 yr old born with 40 fractures ….
    But lives with a fighting spirit …
    Can’t compare him with Reel heros from AP ?

    http://www.thebetterindia.com/47907/sparsh-shah-purhythm-child-prodigy/

  2. Veera

    1997 లోనే బాబు కు సింగపూర్ లో వేల కోట్ల అక్రమ ఆస్తులున్నాయి అని పుస్తకం వేసిన BJP వాళ్ళు ఇప్పుడైనా బయటపెట్టి పుణ్యం కట్టుకోండి !!!

  3. Veera

    లక్ష ఖాళీల మాటేంటి..? నిరుద్యోగుల ఫైర్
    ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు.. లక్ష ఉద్యోగాలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తోందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇంటికో ఉద్యోగం అని, ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రెండువేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆచరణలో మాత్రం నిరుద్యోగులకు ఒక నయాపైసా ఇవ్వలేదని వారు సర్కార్ పనితీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలకు సంబంధించిన 1,42,825 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు విభజనపై ఏర్పాటైనా కమలనాథన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాన్ని ఈసందర్భంగా నిరుద్యోగులు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 2ఏళ్లు పెంచినప్పటికీ 2016, జూన్ నాటికి సుమారు 30వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు జూన్‌నాటికి మొత్తం 1,72,820 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 77,737 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు చెప్పటం గమినిస్తే మిగిలిన 95,088 పోస్ట్‌లు ఎక్కడ పోయినట్లు అని నిరుద్యోగులను ప్రస్తుతం వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న. ఈపరిస్థితుల్లో దశలవారీగా 20వేల పోస్ట్‌ల భర్తీ ప్రకటనపైనా నిరుద్యోగులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2014 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన టీచర్ పోస్ట్‌లకు పరీక్షలు నిర్వహించి నెలలైనా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి కూడా నియామాక ఉత్తర్వులు జారీ చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పొరుగు రాష్టమ్రైన తెలంగాణ నోటిఫికేషన్లులు వరుసగా ఇస్తుంటే ఎపిలో విభజన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వెలువడలేదని నిరుద్యోగులు ప్రభుత్వ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. మరొక వైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదల చేసేందుకు ప్రభుత్వ అనుమతుల కోసం ఏపీపీఏస్సీ ఎదురుచూస్తుందని నిరుద్యోగులు పేర్కొన్నారు. ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవాటినే కుదించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించి నిరుద్యోగులను మరింత మానసిక ఆందోళనకు గురి చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    http://andhrabhoomi.net/content/kri-199

    • Mana Gajji / Gaja dongalu ikkada antha dacharo ?

      Greed turns humans into animals.
      Shame on these crooks who loot their own country when millions across the world have no food to eat.
      They die in disgrace and rot in hell.

  4. Veera

    బాబు రహస్య సర్వే !!!
    బాబు సర్వే లో తూర్పు గోదావరి లో ఉన్న 19 అసెంబ్లీ లలో 11 అసెంబ్లీ లలో పూర్తిగా ఓడిపోతుంది, ఇంకో 4 అసెంబ్లీ లలో కూడా చాల కష్టంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది అని సర్వే సారంశం (Note: 2014 లో YCP 5 సీట్లు మాత్రమే గెలిచింది)
    అందుకే YCP MLA లను చేర్చుకొని మేము బలంగా ఉన్నాము అనే కలరింగ్ ఇస్తున్నాడు బాబు-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,YCP MLC
    http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5135844

  5. Veera

    కాంగ్రెస్ పార్టీ ని విడిచిపోతే జగన్ అంతు చూస్తాను అని జగన్ తో చెప్పు సాయి అని సోనియా గాంధీ నాతో అన్నారు-TDP నాయకుడు, మాజీ కాంగ్రెస్ MP సాయి ప్రతాప్
    సోనియా గాంధీ చెబితేనే నేను జగన్ మీద కేసు వేసాను-శంకర్ రావు
    సిబిఐ కేంద్రం అనే పంజరం లోని చిలుక, యజమాని చెప్పినట్టు డాన్సు చేస్తుంది-సుప్రీం కోర్ట్
    YS వలన లబ్ది పొందినవారు జగన్ కంపెనీలలో 1233 కోట్లు పెట్టారని సిబిఐ ఆరోపణ

    ఉదాహరణకు పెన్నా ప్రతాపరెడ్డి విషయానికి వస్తే.. ఆయన పెట్టుబడుల విలువ 50 కోట్లకు పైగానే అని సీబీఐ నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రతిగా అని చెప్పబడుతున్న ప్రభుత్వం భూ కేటాయింపు విలువ రూ.50 లక్షల రూపాయల్లోపే అని కూడా సీబీఐ నే చెబుతోంది! మరి 50 లక్షల విలువ చేసే భూమిని పొందడానికి 50 కోట్ల రూపాయల పెట్టబడులు పెడతారా ఎవరైనా? అనేది పెన్నా గ్రూప్ వాదన.

    ఇక మరి కొన్ని వ్యవహారాలకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు లేవని.. అయినా కేసులు బుక్ చేశామని స్వయంగా సీబీఐ కోర్టుకు చెప్పింది. ఇదీ క్విడ్ ప్రో కేసుల ప్రస్తుత స్థితి.

  6. Veera

    From Surya Vadrevu
    అప్పట్లో జైల్లో పెట్టారు కాబట్టి సానుభూతి వచ్చింది జగన్ కి
    ఇప్పుడు ఆ పార్టీ ఎమెల్యేలను కొంటున్నారు కాబట్టి సానుభూతి వస్తోంది.

    “””””డబ్బులెట్టి కొనేస్తున్నాడమ్మా ఆ చంద్రబాబు”””
    అంటూ ఊర్లో ముసలమ్మలు కూడా మొటికలు విరుస్తున్నారు.

    ఎదవ గోర్లు ఎన్ని పెంచితే ఏం లాభం.ఉపయోగం లేని శరీరభాగం ఆ గోర్లు.
    ఎం.ఎల్.యే లు పెంచుకోవడం గోర్లు పెంచుకోవడం రెండూ ఒకటే.

    అందరినీ మీ దాంట్లో చేర్చేసుకుంటే ప్రతిపక్షం ఉండదు అనుకోవడం అపోహ.
    మీ దాంట్లోనే పతిపక్షం తయారవుతుంది.

  7. Veera

    ఆశ దోష అప్పడం !!!( TDP తో పొత్తు వద్దు-విశాఖ సదస్సులో BJP నాయకులు
    అక్కడ వెంకయ్య నాయుడు, BJP ప్రెసిడెంట్ మరియు విశాఖ MP కంభంపాటి హరి బాబు చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి లాంటి వాళ్ళు ఉండగా BJP ని ఎదగ నిస్తారా మీ పిచ్చిగానీ !!! వాళ్ళు ఎక్కడున్నా పని చేసేది మాత్రం బాబు కోసమే
    BJP-TDP TIES ON THE ROCKS IN AP
    http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-04-05/BJP-TDP-ties-on-the-rocks-in-AP/218978)

  8. Veera

    అదిరింది గురూ !!!
    తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బలపడుతోంది .. ప్రజల్లో బలహీనమవుతోంది
    -Ramanaraju Dusarlapudi, Kakinada

  9. Veera

    కాంగ్రెస్‌ హయాంలోనే పోలవరం 70% పూర్తి ,ఆ తర్వాత జరిగింది 3 శాతం పనులే
    రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,575 కోట్లు మంజూరు-BJP సోము వీర్రాజు

    నాయుడుపేట, ఏప్రిల్‌ 4: నవ్యాంధ్ర రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,575 కోట్లు మంజూరు చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఈ మొత్తంలో ప్రధానమంత్రి 2,500 కోట్లు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 1000 కోట్లు, అమృత పథకం ద్వారా 75 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.

    పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 70 శాతం పూర్తయ్యాయని.. అప్పటి నుంచి ఇప్పటి దాకా 3 శాతమే పనులు జరిగాయని చెప్పారు. 11 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని జరగాల్సి ఉండగా అందులో రెండు శాతమే జరిగిందన్నారు. పోలవరం పనులు వేగంగా జరిగితే కేంద్ర ప్రభుత్వం సమృద్ధిగా నిధులు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

  10. @ Kamineni chowdary ….apandi drama lu
    Pagalu thitlu …..rathrulu Babu tho muchatlu.

    http://www.sakshi.com/news/district/many-leaders-angry-in-the-bjp-executive-meeting-329474?pfrom=home-featured-stories

    Caste fanatics fooling the public.
    We need to let the National BJP leaders and leaders from all other communities know the facts.

  11. When leaders who are supposed to serve their states and countries turn into dacoits and loot their own people ….
    Panama no different from AP in corruption ?
    Unethical animals buying people’s representatives in AP with corrupt money.

    http://www.theguardian.com/news/2016/apr/03/the-panama-papers-how-the-worlds-rich-and-famous-hide-their-money-offshore

    Do these crooks ever reflect on what they will take with them when they die ?
    They will all Rot in Hell.

  12. Veera

    రాజకీయాల్లోకి బ్రహ్మణి?
    పలు సర్వేల అనంతరం కుమారుడు లోకేష్‌ కంటే కోడలు బ్రహ్మణి తేలిగ్గా ప్రజల మనసులను దోచుకోగలుగుతారని, కొంత కష్టపడితే ఓటర్లను ఆకర్షించవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది
    లోకేష్‌ను పైకి తీసుకొచ్చి జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినప్పటికీ లోకేష్‌ పట్ల ప్రజలు, పార్టీ శ్రేణులు అంతగా ఆకర్షితులు కావట్లేదని సర్వేల్లో వెల్లడైనట్లు తెలిసింది.
    అమరావతిలో భూముల కొనుగోలు మొదలుకొని కొన్ని కుంభకోణాల్లో లోకేష్‌ పేరు ప్రముఖంగా రావడం, ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరగడం వలన లోకేష్‌ ఇమేజ్‌ గ్రాఫ్‌ కిందికి చూస్తున్నట్లు గుర్తించారు.

    ఆమెకు రాజకీయాలపై తర్ఫీదు ఇచ్చేందుకు నిపుణులను నియమించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీకి చెందిన కొంతమంది ప్రముఖులు, సైకాలజిస్టులు ఇక్కడి బాబు ఫాంహౌస్‌లో ప్రతి రోజూ శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రసంగాలపై ఒక మాజీ విద్యార్థి సంఘం నాయకునితో సలహాలిప్పిస్తున్నారని తెలిసింది. జెమిని చానల్‌లో ‘నేను సైతం’ కార్యక్రమంలో బ్రహ్మణి ఇటీవల కనబడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈటివిలో ఆమె ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ప్రోగ్రామ్‌లకు యుట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇతర ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం కల్పించారు. ఈ వరుస పరిణామాలు బ్రహ్మణి రాజకీయ అరంగేట్రానికి సంకేతాలని టిడిపి గణం గుసగుసలాడుతోంది.

    http://www.prajasakti.com/Content/1780474

  13. Veera

    జగన్ ఆస్తుల కేసు-మరో కీలక పరిణామం
    ఎపిలో విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం సంభవించింది.అనంతపురం జిల్లా లేపాక్షి నాలెడ్జిహబ్ భూమి కేటాయింపులకు సంబందిచిన కేసులో సీనియర్ ఐఎఎస్ అదికారి శ్యాంబాబుకు కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో శ్యాంబాబుపై సిబిఐ అబియోగాలు మోపగా,వాటికి ఆదారాలు లేవని కేంద్రం భావించి ఆయనపై విచారణకు అనుమతి నిరాకరించడం విశేషం.దీనిపై ప్రాసెస్ చేయడంలో శ్యాంబాబు బిజినెస్ రూల్స్ ఉల్లంఘించలేదని కేంద్రం అబిప్రాయపడింది. లేపాక్షి హబ్ కు సంబందించి టిడిపి నేతలు పలుమార్లు జగన్ పై ఆరోపణలు సందించేవారు. దానిని రద్దుచేస్తున్నట్లు కూడా గతంలో తెలిపారు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం ఐఎఎస్ అదికారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఆసక్తికరమైన అంశంగానే భావించాలి.
    http://kommineni.info/articles/dailyarticles/content_20160404_31.php?p=1459787029533

  14. Veera

    నన్ను చూసి IT కంపెనీ లు వచ్చాయి -హైదరాబాద్ మేస్త్రి
    మరి ఇప్పుడు AP కి రావడం లేదేమిటి చంద్రం ???

  15. Veera

    చంద్ర జ్యోతి /CBN రాదక్రిష్ణ చౌదరి చెత్త పలుకు లో కమ్మని మాటలు
    (జ్యోతుల నెహ్రూ బలమైన కాపు నాయకుడు,TDPలోకి వెళ్ళాడు కాబట్టి కాపులు అంతా TDP వైపే)
    మరి జ్యోతుల నెహ్రూ YCP లో ఉన్నప్పుడు బలమైన కాపు నాయకుడు అని ఎప్పుడూ రాయలేదే?

    2014 లో ఎన్నికల్లో జగన్ కాపులకు 6 MP , 32 MLA సీట్లు ఇస్తే బాబు కేవలం 2 MP , 20 MLA సీట్లు ఇచ్చినా పవన్ చెప్పాడని కాపులు TDP కి వోటేసారు కానీ జ్యోతుల నెహ్రూ ను చూసో, చిన రాజప్పను చూసో కాదు కదా !!!

    రేపు పవన్ పార్టీ పోటీ చేస్తే మెజారిటీ కాపులు పవన్ కే వోటేస్తారు, పవన్ పోటీ చేయకపోతే బాబు పాలన బాగుంటే బాబుకు లేకుంటే జగన్ కు వోటేస్తారు అంతే కాని జ్యోతులను చూసో చిన రాజప్పను చూసో కాదు.

    కోస్తాలో 2009 ఎన్నికల్లో చిరు PRP కి దాదాపుగా 25% వోట్లు వచ్చాయి, మొత్తం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 17% వోట్లు వచ్చాయి అయినా మొన్న పవన్ చెప్పినా(దాదాపు చిరు అభిమానులు,కాపులు పవన్ వెంట ఉన్నారు ) కోస్తా లో TDP కి ఎక్కువగా వచ్చిన వోట్లు 5% మాత్రమే, AP మొత్తం మీద 1.8% మాత్రమే !!!

    2019 లో కాపులు గంప గుత్తగా TDP కి వేయరు కాబట్టి ముందుంది ముసళ్ళ పండగ .
    నోట్:కాపు సోదరులు పవన్ కు వేసినా మంచిదే,ఇబ్బంది లేదు, కోస్తా లో 20% జనాభా తో బలంగా ఉన్న కాపులు పవన్ చెప్పాడని TDP కి వేయడం వలెనే కోస్తా లో TDP గెలిచింది .
    2014 లో నెల్లూర్ ప్రకాశం తో కూడిన 6 జిల్లాల గ్రేటర్ రాయలసీమ లో ఉన 74 సీట్లలో YCP కి 43, TDP కి 30 సీట్లు వచ్చాయి, చీరాలలో ఇండిపెండెంట్ గెలిచారు

    ఇప్పుడు బాబు కుల పాలన చూసాక గ్రేటర్ రాయలసీమ లో కనీసం ఇంకో 10 సీట్లు ఎక్కువ వస్తాయి.అలాగే 7 జిల్లాల కోస్తా లో ఉన్న100 సీట్లలో 2014 లో YCP కి 24 సీట్లు వచ్చాయి , 2019 లో కనీసం ఇంకో 10 సీట్లు ఎక్కువ వచ్చినా YCP అధికారం లోకి వస్తుంది.

    గుంపులు గుంపులుగా ఒంటరి జగన్ మీదకి వెళితే కూడా జగన్ కు 67 సీట్లు వచ్చాయి, నెల్లూర్ ప్రకాశం లతో కూడిన 6 జిల్లాల గ్రేటర్ రాయలసీమ లో ఇంకో 10 సీట్లు, 7 జిల్లాల కోస్తా లో ఇంకో 10 సీట్లు వచ్చినా 2019 లో YCP విజయం ఖాయం.175 సీట్ల AP లో 88 సీట్లు వస్తే చాలు ప్రభుత్వం ఏర్పడటానికి

    మోడీ కూటమికి వ్యతిరేకంగా ఇండియా లో ఎక్కువ వోట్లు వచ్చింది జగన్ కు , తరువాత జయలలిత కు .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s