తస్సాదియ్యా.. తుస్సుమంది! ఆంధ్రభూమి, Sep 11
కొడంత రాగం తీసి పిట్టంతపాట పాడాట్ట వెనుకటికో గానగంధర్వుడు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రకటన కూడా అలాగే ఉంది. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తున్నామంటూ జైట్లీ చేసిన ప్రకటన ఏపి ప్రజలను ఆగ్రహోదగ్రులను చేసింది
హోదా ఇవ్వకపోతే విడాకులేనని కేంద్రానికి బాబు స్పష్టం చేశారని, అవసరమైతే బయటకు వద్దామని, కేంద్ర వైఖరిపై అమరావతి అధినేత చాలా ఆగ్రహంతో ఉన్నారని, హోదా రాకపోతే బిజెపితో కలసి ఉండటం అనవసరమని, దానివల్ల తాము కూడా మునిగిపోతామని బాబుగారు అనేకమార్లు అంతరంగికులతో చెప్పినట్లు నయా రాజగురువు మీడియా లో చాలాసార్లు వాంతులు చేసుకోవడం కూడా జరిగింది.
సుజనాచౌదరి గారు అసలు ఆ పనిమీదే కేం ద్రాన్ని కదిలిస్తున్నారని అనుకూల మీడియాలో గంటకు పదిసార్లు వచ్చాయి. హోదా తీసుకురాలేకపోయినా ఆ పేరుతో చౌదరి గారు పదేళ్లకు సరిపడా పబ్లిసిటీ పొందారు. తెలివంటే అదీ! జులై నెలాఖరులో జైట్లీ రాజ్యసభలో హోదాపై చేసిన ప్రకటనపై బాబుగారు కూడా ‘రక్తం మరి గే’లా మాట్లాడారు. ఇవన్నీ చూసిన అమాయక జనం పాలకుల వీరావేశం నిజమేకామోసనుకున్నారు. ఇంకేముంది? హోదా రాకపోతే తెలుగు తమ్ముళ్లు అగ్గిరాముళ్లయి, కేంద్రం అంతు చూ స్తారనుకున్నారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు మం త్రులతో రాజీనామా చేయించి, లడాయికి లంగరెత్తుతారేమోననుకున్నారు.
అతిసర్వత్రా వర్జయేత్. నవ్యాంధ్రలో ఇప్పు డు ఇదే కనిపిస్తోంది. హోదా విషయంలో అనుకూల మీడియా రాసిన రాతల వల్ల ఆ పొద్దు గడి చి ఉండవచ్చు.
హోదాపై బాబుగారి ధైర్యం గురించి లేనిపోని కథనాలు వండి వార్చిన అనుకూల మీడియా కథనాలను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు కదా?
అప్పుడు విడాకులు తీసుకుంటామని చెప్పిన (?) బాబు ఇప్పుడు ప్యాకేజీ ఇస్తే విడాకుల ప్రకటన కాకుండా స్వాగతం చెప్పడాన్ని ప్రజలు స్వాగతించరు కదా? నిజానికి బాబు ఆ మాట చెప్పి ఉండకపోవచ్చు. మీడియా భజంత్రీనే ఆయన మెప్పు కోసం అలా రాసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నష్టం ఎవరికి? భజన చేసే వారి చేతులు ఎప్పుడూ ఒకరినే మోయవు. అందునా వ్యాపారం వంటబట్టిన మీడియా చేతులు అసలు మోయవు. బాబు కాకపోతే మరొకరు. కానీ, అనని మాటలతో అప్పటికి సంబరపడి, ఇప్పుడు కష్టాల్లో పడింది పాలకులే కదా?! ఆ ప్రకారంగా ఈ భజంత్రీలు తమకు మేలు చేస్తున్నాయా? కీడు చేస్తున్నాయా అన్నది ఆలోచించుకోవలసిందీ పాలకులే!
కేంద్ర ప్యాకేజీల మాదిరిగానే ‘తెలుగు సర్కారు ప్యాకేజీ’లు తీసుకునే అనుకూల మీడియా కృతజ్ఞత ప్రకటించుకునేందుకు చాలా మార్గాలున్నాయి
కానీ పాలకుల మెరమెచ్చుల కోసం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కట్టుకథలు అల్లితే జనం తాత్కాలికంగా నమ్మవచ్చు. అది అబద్ధమని తేలిన మరుక్షణం వారిలో స్థిరపడే వ్యతిరేకతను ఎన్ని చానెళ్లు, ఎన్ని పత్రికలు తొలగిస్తాయి? రాజకీయ పార్టీలను ఎవరు కాపాడతారు? 2004 అనుభవాలు గుర్తులేవా? అప్పటి కాంగ్రెసుకు ఒక్క పత్రిక తప్ప మిగిలిన మీడియా అంతా వ్యతిరేకమే కదా? మీడియా మొత్తం తెదేపాకు అంకితమయినవే కదా? మరి ఏమయిం ది? కాంగ్రెస్ గెలిచింది కదా? అన్ని భ్రమలు కల్పించినా తెదేపాకు అర్ధశతకం కూడా దక్కలేదు కదా? నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉం టాయి.
ఇప్పుడిక ప్యాకేజీ వల్ల వచ్చే మేలేంటో జనాలకు చెప్పి, వారిని ఒప్పించాల్సిన అవసరం బిజెపి కంటే తెదేపాకే ఎక్కువ. ఎందుకంటే బిజెపి బలం నామమాత్రమే. రెండున్నరేళ్లు మీనమేషాలు లెక్కించి, చివరాఖరకు తుస్సుమనిపించిన కేంద్రంపై కళ్లురుమడం తప్ప, కాలుదువ్వే సీను లేదు. వచ్చిన ప్యాకేజీనయినా సమర్థవంతంగా వినియోగించుకోవడం విజ్ఞత.
పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో పాలకుల చుట్టూ తిరిగే కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు కేంద్రానికి ఉప్పందింది. చేసిన పనుల లెక్కలు చెప్పి, కొత్త నిధులు తీసుకుని, రెండున్నరేళ్లలో ఒక్కటయినా మర్చిపోలేని మేలు చేస్తే అదే పదివేలన్నది జనం భావన. తాను సైతం విభజన లేఖ ఇచ్చినా ఇతరులను బోనులో నిలబెట్టి అధికారంలోకి వచ్చిన తెలివైనే నేత బాబు, ప్యాకేజీ గురించి కూడా జనం మదిలో సానుకూల భావన కల్పిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎటొచ్చీ దెబ్బతిని వాడిపోయేది కమలమే. రాజకీయాల్లో కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. హోదా ఇవ్వలేమని రెండున్నరేళ్లకు చెప్పిన బిజెపిది కూడా ఆత్మహత్యనే. ఆ ముక్కేదో ఏడాది క్రితం చెప్పి ఉంటే, మూలన కూర్చున్న శివాజీ అనే మాజీ కుర్ర హీరో కూడా నాలుగుకాళ్లతో పైకి లేచేవారుకాదు కదా? స్వయంప్రకటిత మేధావుల సంఘాలకు కాళ్లొచ్చేవి కాదు కదా? అలాకాకుండా తెలుగు టివి సీరియల్ జీడిపాకం మాదిరిగా సాగదీసి, తీరా ఇప్పుడు చేయలేమని చేతులెత్తేయడం వల్ల ఉపయోగం ఎవరికి? ఇంతా చేస్తే విభజన చట్టంలో లేనివి కొత్తగా ఇచ్చిందేమిటి?
జనసేన సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అది ఎంతకాలం ఆడుతుందో చెప్పడానికి పెద్ద మేధావులే కానక్కరలేదు. కాకినాడ కాజాలు, పాచిపోయిన లడ్ల మధ్య సాగిన పవర్స్టార్ గారి ప్రసంగంలో పస శూన్యం. రైల్వే జోన్ కోసం స్వయంగా తెదేపానే ఆందోళన మొదలెట్టింది. దానిపై కల్యాణ్బాబు ఏమైనా సెలవిస్తారేమో, అన్యా యం జరిగిన చోట ప్రత్యక్షమవుతామన్నారు కదా!? ఆ ప్రకారంగా ఉత్తరాంధ్ర జనం పక్షాన నిలబడతానని చెబుతారేమోననుకున్నారు. ఆ ఒక్కటీ తప్ప అన్నీ మాట్లాడారు. తెలుగుదేశాన్ని ఇప్పటికీ అభిమానిస్తా, గౌరవిస్తానన్న జనసేనాని(?) జైట్లీ ప్రకటనను స్వాగతించిన తెదేపా తీరుపై గబ్బర్సింగవలేదేమిటి చెప్మా?! కాం గ్రెస్-బిజెపిని పవన్ దూదేకేశారు. తెలుగుదేశం పార్టీని మాత్రం కరుణించారు. ఎప్పుడో క్షతగాత్రురాలయి ఐసియులో ఉన్న కాంగ్రెస్ను, బలం ఉన్న పార్టీ కరుణిస్తే తప్ప, తెరవు లేని బిజెపిని విమర్శిస్తే ఎవరికి లాభం? అసలు కాకినాడలో పవన్ వేసిన కేక ఎవరి కోసం? ఎందుకోసం? బాబు గారు కూడా పవన్ జోలికివెళ్లవద్దని ఆర్డరేశారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక!
హోదాపై ఒకవైపు తాను పోరాడతానని చెప్పి, అదే పోరాటంలో భాగంగా ప్రతిపక్షాలు ఇచ్చిన బందులో పాల్గొనవద్దని చెప్పకనే చెప్పిన, పవన్ భారీ పొలిటికల్ బడ్జెట్ సినిమాకు ప్రొ డ్యూసర్/బయ్యర్ల సమస్య లేదని అర్ధమయిం ది. కానీ ఎంత భారీ బడ్జెట్ సినిమాలయినా జనం చూడకపోతే అది మరో బాషా అవుతుందే తప్ప బాద్షా కాలేదు.
CBN plans for fixing gates to copper am in Polavaram , seems to be ground breaking innovative thought to achieve phase-1 completion of Polavaram.
http://www.muchata.com/main-news/chandrababu-commits-all-blunders-on-polavaram/
Few details on special status
Severe drought in Nagarjuna Sagar left canal areas
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=6296655#
http://www.muchata.com/main-news/mr-babu-these-are-the-benefits-of-special-status/
బాలకృష్ణ ను కాల్పుల కేసు నుంచి రక్షించమని అప్పటి CM YS ఇంటికి అర్ధరాత్రి ప్రయివేట్ కారులో వెళ్లి కాళ్ళు పట్టుకొంది బాబు కానీ నాకు జగన్ సహాయం చేస్తున్నాడు అని బురద చల్లుతాడు.ఓటుకు నోటు కోసం కేసియార్ కాళ్ళు పట్టకొని హైదరాబాదు ను వదిలారు
(బాబు మీద YS వేసిన కేసులు ఉపసంహరించుకోమని ఒక తెల్లవారుఝామున రహస్యంగా YS ను కలిసి బ్రతిమాలుకొని బయటపడింది కూడా బాబే సర్,
అప్పటి కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ను రహస్యంగా కలిసి కేసుల నుంచి బయటపడింది కూడా ఇదే నిప్పు.అప్పట్లో పార్లమెంటులో చిదంబరం చెప్పాడు బాబు నన్ను కలిసాడు అని. అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చింది బాబు రహస్యంగా హోమ్ మంత్రి చిదంబరాన్ని కలిసాడు అని.ఆఖరికి కెసిఆర్ కూడా చెపాప్డు సుజనా చౌదరి గెస్ట్ హౌస్ లో చిదంబరాన్ని కలిసాడు ఈ నిప్పు అని )
బాబూ పవన్, హోదాను ఢిల్లీలో అమ్మాడు , భూములను సింగపూర్ వాళ్లకు అమ్మాడు , నీవు బాబు మాయలో పడొద్దు
-ముద్రగడ
సార్ అయన అలవాట్లు అందరికీ ఉంటాయి అనుకొంటాడు బాబు