అమరావతి బ్రాండ్ నుంచి బాండ్ల వరకూ!
-తెలకపల్లి రవి ( ప్రముఖ రాజకీయ విశ్లేషకులు)
‘అమరావతి భ్రమలు- వాస్తవాలు’ వ్యాసాల పరంపరలో మొదటిది
‘.ఈ సమయంలో రాజధాని కట్టాలంటే కేంద్రం నిధులు ఇవ్వాలి. లేదా అప్పు తీసుకురావాలి. అప్పు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సింగపూర్, చైనా, జపాన్, కొరియా దేశాల సహకారంతో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. నా పేరు చెబితే ఆ దేశాలే ముందుకొస్తున్నాయి. అదీ నా క్రెడిబిలిటీ’ -అమరావతి భూమిపూజలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫిబ్రవరి17, 2016)
‘అమరావతి బాండ్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయంటే అదీ మా ప్రభుత్వంపై వున్న నమ్మకం’ -ముంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో అమరావతి బాండ్ల విక్రయ సభలో చంద్రబాబు నాయుడు (ఆగష్టు 28, 2018)
2014 జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం మేరకు కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే రాజధాని రాజకీయం ప్రారంభమైంది.
రాష్ట్రానికి తప్పని సరి అవసరమైన రాజధాని ఎంపిక నిర్మాణంలో ఏదో మహత్యం ఇమిడి వున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజధాని స్థల నిర్ణయం, అమిత జాప్యంతో సాగే నిర్మాణం రాజకీయ ప్రచారాస్త్రంగానే గాక ఆర్థిక ప్రయోజనాల సాధనంగానూ మారింది. మొదట్లో దోస్తులుగా వున్నందుకు బిజెపి దేశభక్తి తరహా టిడిపి రాష్ట్రభక్తికి రాజధానిని సంకేతంగా చేశారు.
విరాళాల వసూలే గాక అయోధ్య తరహాలో ఇటుకలు ఆన్లైన్ ఇటుకలు సమీకరించడం రసవత్తర ఘట్టమైంది.
2015లో శంకుస్థాపనకు అన్ని చోట్ల నుంచి మట్టీ నీరు తెప్పించడం, ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ కూడా మట్టి నీరు ఇచ్చి నిర్దిష్ట హామీ లేకుండా నిష్క్రమించడం ఒక ప్రహసనమైనా అప్పట్లో ప్రశంసలే కురిపించారు.
నిర్ణయ ప్రకటన ముందు నుంచీ సింగపూర్ రాకపోకలు ముమ్మరంగా నడిపి సర్వం వారికి అప్పగించడమూ జరిగిపోయింది. భూవ్యాపార లావాదేవీలూ జోరందుకున్నాయి. డిజైన్లు, చర్చలు, గోష్టులు భూములిచ్చిన రైతుల భూమిలేని పేదల ఆందోళనలూ రకరకాల ప్యాకేజీలు, మధ్య మధ్య కోర్టుల తీర్పులూ వామపక్షాల ఉద్యమాలు, ప్రతిపక్షం విమర్శలూ, ప్రభుత్వం ఎదురుదాడులూ హోరాహోరీగానే నడుస్తున్నాయి.
ఇన్నిటి మధ్యనా సిఆర్డిఎ పేరుతో సర్వము తానైనవాడెవ్వడు అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన విశ్వాస పాత్రుడైన మంత్రి నారాయణ తదితరులు పర్యటనలూ ప్రకటనలతో సందడి నిలబెట్టడానికి తంటాలు పడుతున్నారు.
ఇప్పుడైతే అప్పుల కోసం అమరావతి బాండ్ల అమ్మకం ఘనతగా చెబుతున్నారు. అమరావతి ప్రపంచం లోని అయిదు గొప్ప నగరాలలో ఒకటిగా తయారవుతుందని ముఖ్యమంత్రి పదేపదే చెప్పడంతో నా అలవాటు ప్రకారం ‘ఇది భ్రమరావతి’ అన్నాను. దానిపై అప్పుడు దుమారం రేగింది గాని అందరూ ఆ మాట స్వీకరించారు. చట్టబద్దమైన రాజధానిగా అమరావతి వేరు. దాని చుట్టూ అల్లిన అతిశయాలతో కూడిన భ్రమరావతి వేరు.
అమరావతి ఎంపికనూ ఎవరూ అడ్డుకున్నది లేదు. విమర్శలూ ఉద్యమాలూ రాలేదా అంటే వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. దానికి కారణం రాజధాని పేరు చెప్పుకుని రాజకీయ బేహారులు సాగించిన వాణిజ్య క్రీడలే.
అవసరాన్ని మించిన భూ సమీకరణ చేసి ఆలస్యమవుతున్నా నిర్మాణ వేగం పెంచని చంద్రబాబు ప్రభుత్వ ధోరణి అందులో భాగమే. ఈ క్రమంలో దారుణంగా నష్టపోతున్నది పేద మధ్యతరగతి వర్గాలు. వారి జీవితమూ హక్కులే నలిగిపోతున్న స్థితి.
పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ అంశాల మధ్య 21వ శతాబ్దపు రాజకీయముంది.
తెలుగుదేశం నాయకత్వం నుంచి వారి మద్దతుదారులైన వాణిజ్యవేత్తల నుంచి అంతర్జాతీయ పెట్టుబడి వరకూ విస్తరించిన రాజకీయమది.
రాజధాని నిర్మాణం తెలుగుదేశం నాయకత్వానికి, మద్దతుదారులకు బాగా లాభ దాయకంగా వుండేట్టు చూడటం చంద్రబాబు రాజకీయ అవసరం. హైదరాబాదు వంటి చోట్ల అన్ని వ్యాపారాలు చేసి లాభాలు పోగుపోసుకున్న వారికి అందుకు దీటైన బంగారు గనిగా రాజధాని కనిపించింది.
అయితే దాని నిర్మాణమంతా పూర్తయిన తర్వాత లాభాలు వస్తాయంటే వారు ఆగరు. కట్టే క్రమంలోనే వారిని తక్షణం సంతృప్తి పర్చాలి. కట్టడం కన్నా ఇది మరింత ముఖ్యం.
2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించ డానికి వారి అండదండలు చాలా అవసరం.
రాజధాని విషయమై నియమితమైన శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సులు ..పర్యావరణ నిపుణులు, పట్టణీకరణ నిపుణులు చెప్పే సూత్రాలు అనుకూలంగా లేవు గనక తీసిపారేయాలి.
నూజివీడు, మంగళగిరి వంటి చోట్ల 50వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూములున్నాయి. కాని వాటిలో రాజధాని కట్టేసే వాణిజ్య వర్గాలకు ఏం లాభం?
కృష్ణాతీరంలో భూములు ఇప్పటికే ఎకరం రూ.రెండు కోట్లు వుంది. అంత పెట్టి కొంటే అస్మదీయులకు లాభం వుండదు.
ప్రైవేటు భూములతో ప్రైవేటు శక్తులతో ప్రైవేటు నమూనా నడవాలి. రైతుల భూములు చవగ్గా తీసుకుని భారీ రేట్లకు అమ్ముకోవాలి.
రాజధాని ఎక్కడో చెప్పేస్తే లేదా చర్చకు పెడితే అందరికీ తెలిసిపోతుంది. ఈ ఉద్దేశంతోనే ముందుగా మంగళగిరి, నూజివీడు, గన్నవరం అంటూ అనేక కథనాలు ప్రచారం పెట్టారు. అక్కడంతా టిడిపి కేంద్ర మంత్రులూ రాష్ట్ర మంత్రులూ స్థానిక నాయకులు రంగంలోకి దిగి పోటాపోటీగా భూములు కొనడం మొదలెట్టారు. రాజధాని ప్రకటన తర్వాత నిబంధనలు మారిపోతే మీకు మొదటికే మోసమని వారిని భయపెట్టారు. రాజధాని వస్తే ధరలు ఏక్దమ్మున కోట్లలోకి పెరిగిపోతాయని ఆశ చూపించారు. అసైన్డ్ భూముల రైతులనైతే మీకు ఎలాంటి హక్కులూ వుండవని బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. దాదాపు ఆరేడు నెలల పాటు ఈ దందా విచ్చల విడిగా నడిచింది. ప్రభుత్వం ఊహాగానాలకు వూతమిస్తూ స్థానికులలో అభద్రత సృష్టించింది. వారు మరింత అమ్ముకునేలా చేసింది. తమ ఉద్దేశం వ్యూహం నెరవేరాయని సంతృప్తి చెందిన తర్వాతనే ప్రభుత్వం అధికారికంగా రాజధాని ఎక్కడో చెప్పింది. అప్పుడు కూడా నిర్దిష్టమైన బిందువు చెప్పలేదు. ఈ అయోమయంలో అమ్మకాలు పెరిగాయి.
రాజధాని ప్రాంతంలో భూ యాజమాన్య స్వరూపం మారింది. దళితులు నిరుపేదలూ తమ భూములు ఘరానా బాబుల చేతుల్లో పెట్టేశారు.
ఆ ప్రాంతంలో నీటి వసతి లేని మెట్ట భూములు ఇవ్వడానికి రైతుల్లో చాలా భాగం సిద్ధంగా వున్నారు. కానీ మూడు పంటలు పండే జరీబు భూములను కూడా తీసుకోకుండా వదల్లేదు.
నదీ ముఖద్వార పర్యాటకం పేరిట ఆ భూములతో వ్యాపారం చేసుకోవడం లక్ష్యం. ఎంత ఒత్తిడి తెచ్చినా ఉండవల్లి, పెనుమాక వంటి చోట్ల రైతులు జరీబు భూములు ఇవ్వక పోవడం గమనార్హం.
వీరిలో ఎక్కువ మంది ఇవ్వకపోవడానికి కారణం కూడా రేపు పెరిగే రేట్లు పొందాలన్న ఆలోచన తప్ప రాజధాని వద్దని కాదు. రాజధాని రావాలి, మా భూములు తీసుకోకూడదని కోరుకున్నవారు చాలామందే వున్నారు. ఆ మాటకొస్తే టిడిపికి చెందిన చాలా మంది ప్రముఖులు భూములివ్వలేదు. పైగా కొనుక్కు న్నారు.
దీన్ని ప్రతిపక్షాలు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అన్నాయి. దానిపై ముఖ్యమంత్రి విరుచుకు పడటమే కాదు. భూములు కొంటే తప్పేమిటని శాసనసభలో అధికారికంగా వాదన చేశారు. ఈ దశలో ఇదో విధమైన తలకిందులు దేశభక్తిగా మారింది. వీరంతా సన్నిహితుల పేర్లతో వ్యాపార సంస్థల పేర్లతో కొన్నది బయిటకు రాలేదు. రాజకీయవేత్తలే గాక సూపర్ స్టార్లు కూడా వెంచర్లు మొదలు పెట్టారు.
అంతేగాక రాజధాని కట్టేలోగా విజయవాడలో ప్రభుత్వ సభలూ కార్యక్రమాలు జరగాలి. వాటికి పాలక పక్షీయుల హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు భారీ రేట్లతో తీసుకోవడం పరిపాటిగా మారింది. ఒకటి రెండు హాళ్లు కట్టుకోవడం నిజానికి ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఇలాంటి వారి ప్రైవేటు భవనాలలోనే ఏర్పాటు చేయడం వల్ల అద్దెలు అడ్వాన్సుల రూపంలో బోలెడు లాభం ముట్టచెప్పడంతో అమరావతి వ్యవహారం పొడుగు చేతుల పందేరంగా మారింది.
ఈ ప్రయోజనం పొందిన వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ప్రభుత్వ యంత్రాంగంలో ప్రధాన భాగంగా వుండటం విమర్శలను పెంచింది.
ఇప్పుడు ఈ ప్రభుత్వం పదవీ కాలం ముగింపునకు వస్తుంది గాని తాత్కాలిక సచివాలయం, శాసనసభ సముదాయం తప్ప చెప్పుకోదగిందేదీ అక్కడ రాలేదు.
అది గాక ఎస్ఆర్ఎం విట్ ప్రైవేటు విద్యా సంస్థల భవనాలు వుంటాయి. రకరకాల రోడ్ల నిర్మాణాలు నడుస్తున్నాయి. కొన్ని నివాస సముదాయాల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
రైతుల దగ్గర రకరకాల రూపాలలో సమీకరించిందీ, ప్రభుత్వ భూమి పేరిట కలిపేసుకున్నదీ మొత్తం యాభై వేల ఎకరాలకు పైగా పోగు వేయడంలో చూపిన శ్రద్ధ తదుపరి దశలో కనిపించలేదు.
అధికారుల ఒత్తిడి తో పండించడం మానేసిన పొలాలు ఒకవైపు. పనుల కోసం పక్క ఊళ్లకు పరుగులు తీసే శ్రామికులు మరోవైపు. మిగిలిన వారితో వ్యాపారాలు చేసుకుంటున్నవారు ఇంకొక వైపు దర్శనమిస్తున్నారు.
2015 సెప్టెంబరు 4న శాసనసభలో చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేశారు. అంటే అక్షరాలా నాలుగేళ్లు పూర్తయ్యాయి. భూ సమీకరణ నోటిఫికేషన్ ఆ ఏడాది చివరలో విడుదలైంది. తర్వాత పదే పదే శంకుస్థాపనలు, ఈవెంట్లు, అంతర్జాతీయంగా తనకున్న బ్రాండ్ ఇమేజి వల్ల చాలా పెట్టుబడులూ పరిశ్రమలూ వస్తాయన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల నుంచి అప్పులు సేకరించడం కోసం అమరావతి బాండ్లు విడుదల చేస్తున్నారు. ఇవి వెంటవెంటనే అమ్ముడు పోవడం తన బ్రాండ్ ఇమేజి అని ఇప్పుడంటున్నారు. ఈ రెంటికి మధ్య పరిణామాలు చెప్పేదేమిటి?
Source-అమరావతి బ్రాండ్ నుంచి బాండ్ల వరకూ! ప్రజాశక్తి ,Sep 5,2018
JAGAN in Gajuwaka
Warning from Naxal’s to the corrupt MLA’s sold to a corrupt CM caught redhanded buying Telangana MLA’s ….
https://www.sakshi.com/photos/photo/ys-jagan-padayatra-photo-gallery-1124554#3
Banks ki Vela kotlu topi peduthu ….
Paccha media tho itharulaku neethulu cheputhu …
Jalsa chesthunna ……Gajji / Gaja Dongalu
Chee chee kondhari neethimalina brathukulu.
https://www.greatandhra.com/politics/political-news/ed-raids-on-sujana-group-firms-in-hyderabad-92487.html
Dabbu ki ammudu poyina neethimalina MLA’s ki Deadline peduthunna Naxal’s ….
Veerini konna Gajji / Gaja Dongalu papam pandedhi appudu ?
https://www.sakshi.com/news/andhra-pradesh/maoist-central-committee-letter-media-over-bauxite-mining-1124283
Million’s of foot steps following one Daring young man fighting against all odds to restore democracy in AP ….
Use Social media to expose the unethical caste fanatic Yellow media in AP.
https://www.sakshi.com/photos/photo/ys-jagan-padayatra-vizianagaram-photo-gallery-1123623
https://www.sakshi.com/news/politics/ys-jagan-fires-chandrababu-nellimarla-1122556
https://www.sakshi.com/photos/photo/ys-jagan-padayatra-vizianagaram-photo-gallery-1122485
Murthy garu ….RIP
You have always encouraged caste fanatism in colleges and politics.
You have commercialised education.
Sadly you took neither the caste nor your money with you.
https://www.sakshi.com/news/crime/gitam-universities-chief-mvvs-murthy-died-accident-america-1122284
https://www.sakshi.com/photos/photo/ys-jagan-padayatra-vizianagaram-photo-gallery-1121881
Padayatra ……Vizianagaram
https://www.sakshi.com/photos/photo/ys-jagan-prajasankalpayatra-completed-3000-km-milestone-photo-gallery-1119849#1
JEENA HAI THO MARNA SEEKHO ….
KADHAM KADHAM PAR LADNA SEEKHO –
Anni rojulu brathikamu anedhi mukhyam kadhu ….
Brathikinannallu ala brathikamu anedhi mukhyam – YS JAGAN
A tireless Fighter against all odds…..An Inspiration for generations to come.
Padayatra………Idupulapaya ……Day 1
Padayatra …….1000 km
Padayatra …….2000 km
The MAN on a Mission ……Padayatra …..3000 km
Padayatra …..Bheemili
A life lost because of some narrow minded unethical caste fanatics who can see nothing but caste and money in their lives ….
When will this society change ?
When will the media stop encouraging caste system and bring some democratic and human values back ??
Kurchi kosam …NTR ni champina vyakthiki
NTR Athma ni kuda champatam oka lekka ??
Chee chee kondhari Viluvalu leni brathukulu.
http://www.lawyerteluguweekly.com/%E0%B0%85%E0%B0%AA%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%82/
Kulala Picchi tho Kulli pothunna Desam …Rastram
Aina kani Kula gajji vedhavalu varini support chesa Media mararu
Unethical Caste fanatics will Rot in Hell
Narrow minded fanatics who see nothing but caste and money in their lives should learn from History….
Spread Love and not Hatred . You take nothing with you when you leave this world.
SPREAD LOVE AND NOT HATRED …Life is short on Earth.
https://www.sakshi.com/photos/photo/ys-jagan-public-meeting-kancharapalem-photo-gallery-1115682#1
Padayatra …..VIZAG…..Janatsunami
JOHAR YSR …
The LEADER who has Never let his friends down and who will NEVER let the Public down…..YS JAGAN
How hard is it to say NAZI’s are BAD ?….Obama
How hard it it to say that Yellow Caste Fanatics are BAD for AP ???
The next few months are crucial to restore Democracy , Humanity and Ethical values in AP politics.
Use Every means that you can to support JAGAN and to bring back Hope for everyone in AP cutting across caste , religion and regions.
Please DO NOT SIT BACK and watch the game. Be an Active participant because you have the role and responsibility to change thIngs for GOOD.
https://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-hps-friends-participated-prajasakalpa-yatra-vizag-1115372
https://www.sakshi.com/photos/photo/prajasankalpayatra-day-255-photo-gallery-sabbavaram-1114487#1