Category Archives: Uncategorized

జగన్ మీద పెట్టిన 11 చార్జీషీట్ల మొత్తం విలువ 1300 కోట్లు–ఉండవల్లి

జగన్ మీద పెట్టిన 11 చార్జీషీట్ల మొత్తం విలువ 1300 కోట్లు–ఉండవల్లి
కానీ జగన్ లక్ష కోట్లు తిన్నాడని టిడిపి సభ్యులు నానాయాగీ చేసారు.ఈ మధ్య జగన్‍‌ విమానాశ్రయంలో కలిసి అన్నా 1300 కోట్లు అంటున్నావు ,500 కోట్లు క్లియర్ అయిపోయాయని, ఇంకా ఉంది 800 కోట్లేనని నాతొ చెప్పాడు

800 కోట్లు ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ ?

రసీదు ఇచ్చాడుగా, క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?

కరప్షన్ అంటే ఎవరికైనా ఉపకారం చేసి కొంత డబ్బు తీసుకోవడమని, తండ్రి సీఎం అయినంత మాత్రాన బిజినెస్ చేయవద్దని లేదని, జగన్ రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టారని, లంచం తీసుకున్నవాడు ఎవరైనా ఆ లంచానికి రసీదు ఇస్తాడా అని, జనగ్ వాళ్ళకు షేర్లు ఇచ్చి, రసీదు ఇచ్చాడని, ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ఉండవల్లి అన్నారు.

జగన్ వద్ద ఉన్న డబ్బు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టర్ అయి ఉన్నవే తప్ప ఒక్క రూపాయి ఎక్కువ లేదు

8 Comments

Filed under Uncategorized

పోలవరం అవినీతి పై బాబు కు 8 ప్రశ్నలు వేసిన KVP

1.2015 మార్చిలో పిపిఎ అధికారులు పోలవరం అంచనాలను ప్రస్తుత ధరలకు సవరించి ఇవ్వాలని కోరగా, ఒక నెలలో ఇస్తామని చెప్పిన మీరు 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ప్యాకేజి ప్రకటించే నాటికి కూడా ఇవ్వకుండా ఎందుకు నాటకాలు ఆడారు?

2.పిపిఎ అధికారులు 2014 మార్చి 31కి ముందు ప్రాజెక్ట్‌పై చేసిన ఖర్చును రాష్ట్ర వాటాగా భావిస్తామని, అదేవిధంగా.2014 ఏప్రిల్‌ 1 తరువాత ప్రాజెక్ట్‌పై అయ్యే ఖర్చులో ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందని పదేపదే స్పష్టం చేసింది. అయినా ఎందుకు ప్రతి సమావేశంలో పాత ఖర్చులు, ఇతర జాతీయ ప్రాజెక్ట్‌లకు వలే 90శాతం నిధులివ్వాలని డిమాండ్‌ చేశారు?

3.జీవో నెంబర్‌ 22 జారీ చేసిన తరువాత, అదనంగా లేబర్‌, యంత్రాలు, ఇతర మెటీరియల్‌ ధరల తేడాలు ప్రభుత్వమే భరిస్తే..కాంట్రాక్టర్లకు నష్టం వచ్చే అవకాశం ఎక్కడున్నది?

4.కేంద్రమిచ్చిన ప్యాకేజీలో.2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారమే నిధులు ఇస్తామనే షరతుకు మీరేందుకు అంగీకరించారు?

5.2018 జనవరి 11న జరిగిన పిపిఎ ఏడో సమావేశంలో అధికారులు పునరావాస కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో కావలసిన నిధులు ఎలా సమకూర్చుకొంటారని అడిగినప్పుడు, కేంద్రమే ఇవ్వాలని తేల్చి చెప్పకుండా, పునరావాసం ఫేజ్‌ల వారీగా చేస్తామని ఎందుకు చెప్పారు?

6.ఏప్రిల్‌లో నిపుణుల కమిటీకి ప్రాజెక్ట్‌ అంచనాలు రూ.46,926 కోట్లుగా చెప్పిన మీరు, ఆగష్టు నాటికి అంచనాలను రూ.58,319 కోట్లకు ఎలా పెంచారు?

7.పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనికి 2015-16 అంచనాల ప్రకారం రూ.5,535 కోట్లు ఖర్చుగా పేర్కొంటూ 2016 సెప్టెంబర్‌ 8న జీవో 96 జారీ చేసిన మీరు, అదే హెడ్‌వర్క్స్‌ మిగిలిన పనికి 2013-14 అంచనాల ప్రకారం రూ.11,638 కోట్లు ఖర్చుగా పేర్కొంటూ కేంద్రానికి ఎలా పంపారు?

8.పోలవరం పూర్తి ఖర్చును విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించాలని మీరు ఇప్పటికీ అనుకొన్నట్లైతే..అదే విషయాన్ని హైకోర్లులో తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్‌ ద్వారా తెలియపరిచేందుకు ఎందుకు భయపడుతున్నారు?

18 Comments

Filed under Uncategorized

భాగస్వామ్య ప్రహసనం-ప్రజాశక్తి

విశాఖలో భారీ హంగులు, ఆర్భాటాల మధ్య మూడు రోజుల పాటు సాగిన భాగస్వామ్య సదస్సు పిసి సర్కార్‌ మ్యాజిక్‌ షోను తలపించింది. వందల్లో అవగాహనా ఒప్పందాలు, లక్షల కోట్లలో పెట్టుబడులు, ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనల హోరు, వాటినే పరమ సత్యాలుగా ప్రచార బాకాలు మోత మోగించిన తీరు చూస్తే పెట్టుబడులు సునామీలా వచ్చి పడబోతున్నాయని, ఇక నిరుద్యోగ సమస్య అనేదే వుండదనేంతగా ప్రచారం సాగింది.

ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందితే సంతోషించనివారెవరుంటారు. విభజన తరువాత రాష్ట్రం వ్యవసాయ, పారిశ్రామిక, సేవలు తదితర రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందాలని, అందరికీ ఉపాధి దొరకాలనేదే అయిదు కోట్ల మంది ఆంధ్ర పజల ప్రగాఢ ఆకాంక్ష. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే ఎవరూ ఆక్షేపించాల్సిన పని లేదు.

కానీ విశాఖ భాగస్వామ్య సదస్సులో గతంలో మాదిరిగానే పాత ప్రతిపాదనలకే కొత్త ఎంఒయు ముసుగులేయడం, రాని పెట్టుబడులను వచ్చినట్లు, లేని ఉద్యోగాలు కల్పించేసినట్లు భ్రమలు కల్పించడమే అభ్యంతరకరం.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యు ఇఎఫ్‌) తరహాలో సిఐఐతో కలిసి మన రాష్ట్రంలో ప్రతి ఏటా ఇటువంటి సదస్సులు నిర్వహించి పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇందుకోసం విశాఖలో ఓ బ్రహ్మాండమైన అంతర్జాతీయ సమావేశ కేంద్రం, అయిదు నక్షత్రాల హోటల్‌, షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు దుబాయికి చెందిన లూలూ గ్రూపు సంస్థతో ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. విలాసవంతమైన సమావేశ మందిరాలు, ఖరీదైన హోటళ్లు, భారీ షాపింగ్‌ మాల్స్‌ కడితే పెట్టుబడిదారులు ఆంధ్ర ప్రదేశ్‌కు క్యూ కడతారనేది భ్రమ.

విశాఖలో గత మూడేళ్లలో ఈ భాగస్వామ్య సదస్సుల కోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు వెచ్చించి అనేక హంగులు, ఆర్బాటాలు చేసినా, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, ఉన్నతాధికారుల బృందం విదేశీ యాత్రలు, రోడ్‌ షోలు ఎన్ని నిర్వహించినా పెట్టుబడులు వచ్చింది చాలా తక్కువ.

పెట్టుబడికి కావాల్సింది లాభం. ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందనుకుంటే అక్కడికి అది పరుగులు తీస్తుంది. పెట్టుబడి స్వభావమే అంత. అంతేకాదు పెట్టుబడులు రావడంతోనే ఉపాధి దానంతటది పెరుగుతుందనుకోవడం కూడా పొరపాటు. ఆ పెట్టుబడులు ఏ రంగంలో వస్తున్నాయన్నది కూడా ముఖ్యం. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఉపాధి రహిత అభివృద్ధి అనేది ఒక పెద్ద సమస్యగా ముందుకొస్తున్నది. ఆధునిక టెక్నాటజీతో వస్తున్న పెట్టుబడులు కొత్త ఉద్యాగాలిస్తున్నది చాలా తక్కువ కానీ స్థానిక ప్రజల జీవనోపాధిని పెద్ద ఎత్తున దెబ్బ తీస్తున్నాయి. దాంతో మొత్తంగా ఈ పెట్టుబడుల వల్ల నిరుద్యోగం పెరుగుతున్నదే గానీ తగ్గం లేదు.

మరో ఏడాదిలో రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలకు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. తాజా భాగస్వామ్య సదస్సు వల్ల 4లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నట్లు, దీనివల్ల పదకొండు లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నట్లు త్రీడీ చిత్రం చూపిస్తున్నారు.

ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెంచేందుకు కృషి చేయకుండా, కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి పూర్తి పన్ను రాయితీ కల్పించే ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా భాగస్వామ్య సదస్సుల పేరుతో 2016లో 4.76 లక్షల కోట్లు, 2017లో 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ప్రభుత్వం చూపే లెక్కలన్నీ కాగితాలపై బాగానే కనిపిస్తున్నా, వాటిలో కార్య రూపం దాల్చినవి చాలా తక్కువ.

1991-2014 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ సంస్థలతో 8,96,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటిలో 4.67 శాతం మాత్రమే ఆచరణ రూపం దాల్చాయి.

సిఐఐ భాగస్వామ్య సదస్సులు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అక్కడ పాల్గొన్న పెట్టుబడిదారులే ఇక్కడా పాల్గొంటారు. ఒకే విధమైన వ్యాపార అంశంపై విభిన్న ఎంఓయులను కుదుర్చుకుంటారు. ఇది నిత్యం జరుగుతున్న తంతు. విశాఖలోనూ అదే పునరావృతం అయింది.

మరోవైపు రాని పరిశ్రమలను సాకుగా చూపి ప్రభుత్వం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోంది. ఏళ్లు గడిచినా పరిశ్రమ రాదు. భూములు, రాయితీలు, బ్యాంకు రుణాలు మాత్రం కార్పొరేట్‌ సంస్థలకు దక్కుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేవలం పెట్టుబడులపై ఆధారపడితే చాలదు. ప్రజల వద్ద కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలి.

మరోవైపు రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అభిస్తే కొంతమేరకైనా పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తాయి. ఈ దిశగా కృషి చేయకుండా ప్రచారార్భాటంతో ప్రజలను వంచించబూనుకోవడం క్షంతవ్యం కాదు.

http://www.prajasakti.com/Article/Sampaadkeyam/2014248

12 Comments

Filed under Uncategorized

జగన్‌తో ‘వాకింగ్ ఇంటర్వ్యూ…! ఓ జర్నలిస్టు స్వగతం…!! –

జగన్‌తో ‘వాకింగ్ ఇంటర్వ్యూ…! ఓ జర్నలిస్టు స్వగతం…!! –
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ సీనియర్ జర్నలిస్టు జగన్ వెంట ఉన్న ఓ ఆర్గనైజర్ వెంటబడ్డాడు… ‘సార్‌తో కాసేపు మాట్లాడాలి, ఇంటర్వ్యూ ఇప్పించండి’… వర్కవుట్ కాలేదు… మొన్న నేరుగా జగన్ పాదయాత్ర జరుగుతున్న ప్లేస్‌కు వెళ్లిపోయాడు.., మళ్లీ తనకు తెలిసిన వాళ్లను అడిగాడు ఇదే… ‘ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అంటే కష్టం… కానీ ఓ పనిచేద్దాం… నేను నిన్ను స్వయంగా తీసుకుపోయి, సార్‌కు ఓ మాట చెబుతా… ఊరికీ ఊరికీ నడుమ ఉండే దూరం ఆయనతోపాటు నడుస్తూ, ఇంటర్వ్యూ తీసుకో..’ అంటూ ఆ జర్నలిస్టును జగన్ వద్దకు తీసుకుపోయి వదిలేశాడు…

సదరు జర్నలిస్టు ఇక జగన్ వెంటే నడుస్తూ, తను అనుకున్న కొన్ని ప్రశ్నలు అడిగాడు… తను మధ్యమధ్యలో తారసపడే గుంపులకు దండం పెడుతూ, పలకరిస్తూనే ఈయనకు జవాబులు ఇస్తూ పోయాడు… కాసేపటికి ఓ పెద్ద ఊరు వచ్చింది… జెండావిష్కరణ, కార్యకర్తలు, నినాదాలు, హోరు, జనం, హడావుడి… సదరు జర్నలిస్టు ఇంటర్వ్యూ అక్కడికి కట్టయిపోయినట్టే ఇక…

మరో గంటన్నర సేపటి తరువాత… ఈ ‘వాకింగ్ ఇంటర్వ్యూ’కు సహకరించిన మిత్రుడికి థాంక్స్ చెప్పి వెళ్లడం కోసం కలిశాడు ఆ జర్నలిస్టు… ఆయన కుతూహలంగా ‘ఎలా ఉంది సార్..? సరిపోతుంది కదా..?’ అనడిగాడు…

‘‘హైదరాబాద్‌లో, అమరావతిలో, ఢిల్లీలో కూర్చుని చూసే జర్నలిస్టులకు కనిపించే పిక్చర్ వేరు… ఫీల్డ్ వేరు… అది తెలుసుకుందామనే అనుకున్నా… తెలుగు మీడియా ధోరణి, వాళ్ల కవరేజీ ప్రాధాన్యతలు చూస్తుంటే… అసలు పాదయాత్ర పలుచబడిపోయిందనీ, ఫ్లాప్ అనీ, జనం పెద్దగా ఇంట్రస్టు చూపించడం లేదనీ అనిపించడం సహజమే… టీడీపీ శిబిరం అదే ప్రచారం చేస్తున్నది… నేను జగన్‌తో మాట్లాడటమే కాదు, ఆయన వెంటే పాదయాత్ర చేస్తున్న వాళ్లతో మాట్లాడాను… ఆయన కోసం ఎదురు చూసిన సాధారణ జనంతో కూడా మాట్లాడాను… ఇన్నిరోజులు, ఇన్ని కిలోమీటర్ల యాత్ర అనంతరమూ వేల మంది వస్తున్నారు… నాయకులే ఇలా జనాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారా అనేది పక్కనపెడితే, పాదయాత్ర టెంపోను ఇప్పటికీ ఇలాగే కొనసాగించడం విశేషమే… ఆయన తిరుగుతున్నంత మేర జనంలో చర్చ అయితే జరుగుతున్నది…’’ అంటూ చెప్పుకుపోయాడు ఆ జర్నలిస్టు స్వగతంలా…

‘‘ఈ రూటులోనే కనిపించిన ఓ ఉద్యోగిని అడిగాను… పవన్ కల్యాణ్ పర్యటన ప్రభావం ఎలా ఉంటుందీ అని… ఆయన చెప్పిన జవాబు విని ఉలిక్కిపడ్డాను… ‘ఏముంది సార్..? జగన్ పాదయాత్రను డైల్యూట్ చేయటానికి చంద్రబాబు రంగంలోకి దింపాడు తనను… మాకు అర్థం కావడం లేదా..? చంద్రబాబును మోసే చానెళ్లు, పేపర్లు పవన్ కల్యాణ్‌ను కూడా ఆ అవసరం కోసమే మోస్తాయి… తరువాత చిరంజీవి కూర్చున్న కొమ్మను నరికినట్టే, పవన్ కల్యాణ్ కొమ్మను కూడా వాళ్ల అవసరం తీరాక నరికేస్తారు…

టీవీల్లో చర్చలు కూడా కమ్మగీతాల మీద, వర్మ బూతు సినిమా మీద, నరసింహారెడ్డి కథ మీద, మహేష్ కత్తి మీద సాగిస్తుంటారు… జనానికి వేరే సమస్యలే లేవా..? ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు, పాలన వైఫల్యాలే లేవా..? ఇదంతా ఓ స్ట్రాటజీ…’ ఈ విశ్లేషణ విని విస్తుపోయాను… జనం ఇంత కీన్‌గా మీడియాను అబ్జర్వ్ చేస్తున్నారా అనిపించింది… మీడియా మేనేజ్‌మెంట్‌పై కూడా జనంలో చర్చ జరుగుతున్న తీరు స్ట్రేంజ్ అనిపించింది…

ఎన్నికల్లో గెలుపూఓటమికి అనేకానేక కారణాలుంటాయ్… తన పట్ల ఆదరణను వోట్ల రూపంలోకి మలుచుకోలేక లాస్ట్ ఎన్నికల్లో వోడిపోయాడు… అతి విశ్వాసం, అనుభవరాహిత్యం కూడా…! రేప్పొద్దున ఏ రాజకీయ ఫలితం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ, పాదయాత్ర ఇంపాక్ట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది…’’ అంటాడు ఆ జర్నలిస్టు…

‘‘అన్నట్టు, మీవాళ్లకు ఓ సలహా… మిగతా మీడియా ఎలాగూ జగన్ వ్యతిరేకమే… మరి సొంత మీడియా కవరేజీ అయినా కాస్త భిన్నంగా, లైవ్‌గా ఉండాలి కదా… పూర్ కవరేజీ… రాశి కాదు ముఖ్యం, వాసి కదా కావల్సింది..? అలాగే తను ప్రస్తావించేవన్నీ జిల్లా టాబ్లాయిడ్ వార్తల్లా మరీ స్థానికం అయిపోతున్నాయి…

ఎంతసేపూ పెన్షన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, ఆరోగ్యశ్రీ… ఇవి దాటి మరింత విస్తృతంగా చూడాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి… మీ సార్ బావి నుంచి చెరువులో పడాలి… ఈ విషయంలో మీ ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నట్టో మరి..?’’ అన్నాడు…

ఆయనకు ఏం బదులివ్వాలో తెలియలేదు… ఈలోపు ఆ సీనియర్ జర్నలిస్టు బైబై అని సెలవు తీసుకుని అక్కడి నుంచి కదిలాడు…
-muchata dot com

https://www.muchata.com/off-beat/a-journalist-with-jagan-padayatra/

42 Comments

Filed under Uncategorized

జగన్‌ మాట తప్పడు.. ఆశీర్వదించండి

కొమ్మినేని :అప్పుడే తొమ్మిదేళ్లు అయిపోయాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు? వీటిని తలచుకుంటే ఏమనిపిస్తోంది?
విజయమ్మ: రాజశేఖరరెడ్డి పోవడమే మాకు పెద్ద షాక్‌. ఆయన దాదాపు 35 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేశారు. మరణించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వారికి రాజశేఖరరెడ్డి నచ్చలేదు. జగన్‌ నచ్చలేదు. ఆయన ద్వారా పైకి వచ్చినవారు, సహచరులు, ఆయనతో చాలా దగ్గరగా ఉన్న వారు ఎవరూ ఈ కుటుంబ పక్షంగా నిలబడకపోవడం చాలా బాధగా అనిపించింది. అన్యాయంగా కేసులు పెట్టి జగన్‌ను వేధించారు. జైలులో పెట్టించారు. ఎన్నో ఇబ్బందులను ఈ కుటుంబం ఎదుర్కొంది. అయినా జగన్‌ ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని జగన్‌ ఎప్పుడూ అనుకోలేదు. పొమ్మనలేక పొగబెడతారన్నట్లుగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు సృష్టించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నాడు. ఓదార్పు యాత్రకు అనుమతి తప్ప మరేమీ అడగలేదు. అందరూ మాతో బాగానే ఉండేవారు. కానీ సోనియా గాంధీకి, కేంద్రంలోని వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చారు. సంతకాలు జగనే పెట్టించాడన్నట్లుగా ఆమెకు రిపోర్టులు పంపించినట్లు ఉన్నారు. ఆమె దాన్నే చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు.

ఒక్క విషయంలో రాజీపడి ఉంటే మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు కదా
విజయమ్మ: ఓదార్పు యాత్రను మధ్యలో ఆపేశారు. రాజశేఖరరెడ్డికి అంత మంచి పేరు ఉందని కాంగ్రెస్‌ వారు కూడా ఊహించలేదనుకుంటా. ఒక జిల్లాలో యాత్ర చేయడానికి అనుమతించారు. ఆ జిల్లాలో ప్రజలు రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమనంతా జగన్‌పై చూపించారు. ఇది కాంగ్రెస్‌ వారికి నచ్చలేదనుకుంటా. అందుకే ఓదార్పు యాత్ర వద్దని ఆపించారు. తర్వాత మేం పరిస్థితులను వివరించడానికి అవకాశం ఇవ్వడంటూ సోనియా గాంధీకి లేఖ రాశాం. ఐదు వారాల తర్వాత సోనియాగాంధీ పిలిచారు. దీంతో నేను, షర్మిళ, జగన్, భారతమ్మ కలిసి వెళ్లాం. ‘మీరు రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు. ఒకేచోటకు అందరినీ పిలవండి. ఒక విగ్రహమే పెట్టండి. అంతకు మించి తిరగొద్దు. ఇది పార్టీ నిర్ణయం’ అని సోనియా చెప్పారు. షర్మిళ కళ్లల్లో నీరు పెట్టుకుని అడిగారు. ‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక మరణించిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడమే సరైన పద్ధతి’ అని షర్మిళ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఒకచోటకు పిలవాలనడం మాకు నచ్చలేదు. అందుకే ఇచ్చిన మాట మేరకు జగన్‌ ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని నిర్ణయించుకుని బయటకు వచ్చారు. ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. యాత్రకు వెళ్లొద్దు, సహకరించొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కట్టడి చేశారు. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి.

పార్టీ నుంచి బయటకు వెళితే ఇబ్బంది పడాల్సి వస్తుందని కేవీపీ లాంటి వారు చెప్పారట కదా?
విజయమ్మ: చెప్పారు. వీరందరూ చెప్పారు. ఈ పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రిని చేస్తారు, బయటకు వెళ్లవద్దని చెప్పారు. అయితే పార్టీ నుంచి జగన్‌ బయటకు వెళ్లక తప్పని పరిస్థితి సృష్టించారు. కడప జిల్లాకే పరిమితం చేశారు. మా ఇంట్లో తన నుంచి చిన్నాన్నను విడదీసేందుకు జరిగిన కుట్ర జగన్‌కు నచ్చలేదు. ఇక ఆ పార్టీలో మనం మన్నన పొందలేమమ్మా, బయటకు వెళ్లిపోదామని అన్నాడు.

కొత్త పార్టీ పెట్టడానికి మీరు అంగీకరించారా?
విజయమ్మ: ఆ సమయంలో అదే సమంజసం అనిపించింది.

జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తుండడం మీకు ఎట్లా అనిపిస్తోంది?
విజయమ్మ: ఈ కుటుంబంలో నేను ముగ్గురి (వైఎస్సార్, షర్మిళ, జగన్‌) పాదయాత్రలు చూశా. అందరిదీ ఒకే లక్ష్యం. వాళ్ల నాన్న లాగా ప్రజలతో ఉండాలని, వారికి మేలు చేయాలనే తపన జగన్‌లో చాలా ఎక్కువగా ఉంది. అతడు రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇదే కారణం. ప్రజలు తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నప్పుడు జగన్‌ భరోసా ఇస్తున్న తీరు చూస్తుంటే నాకు రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు.

మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో… అని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారు కదా!
విజయమ్మ: ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్‌ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, ఇంట్లో అందరితో సంతోషంగా ఉండటమే తెలుసు.

చంద్రబాబు విమర్శించినప్పుడు మీకు ఎలా అనిపించేది?
విజయమ్మ: అసెంబ్లీలో జగన్‌ను మంత్రులు రెచ్చగొట్టినప్పుడు, కొందరు నేతలు జగన్‌ గురించి ఏదేదో మాట్లాడినప్పుడు, అసత్య ఆరోపణలు చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చేవి. చాలా బాధ కలిగేది. జగన్‌ మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వాళ్లు అలా అనకుండా ఇంకేమంటారమ్మా.. అంటూ నన్ను సముదాయించేవాడు.

ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న స్పందన చూస్తే మీకేమనిపిస్తోంది?
విజయమ్మ: జగన్‌ పాదయాత్రకు లక్షలాది మంది వస్తున్నారు. నా దృష్టిలో ఎన్ని కిలోమీటర్లు నడిచారనేది పెద్ద ప్రాతిపదిక కాదు. మనం ఎన్ని లక్షల మందిని కలిశాం? ఎంతమందికి విశ్వాసం కల్పించాం? ఎంతమందికి ధైర్యం కల్పించగలుగుతున్నామనే అంశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 25 ఏళ్లు పట్టింది. అన్ని రోజులూ జనం ఆయనను నాయకుడిగా నమ్మారు. ఆయనపై అభిమానం చూపారు. ప్రజలకు తాను రుణపడి ఉన్నానని రాజశేఖరరెడ్డి అనుకునేవారు. ఈ రోజు ఆ జనం కోసం నా బిడ్డ నిలబడుతున్నాడని తలచుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది.

ఎమ్మెల్యేలతో జగన్‌ సంతకాలు పెట్టించాడన్న అపవాదు చాలా తప్పు. రాజశేఖరరెడ్డి మరణంతో మేము షాక్‌లో ఉన్నాం. సంతకాలు పెట్టించిన సంగతి కూడా జగన్‌కు తెలియదు. సీఎం కావాలని జగన్‌ అనుకోలేదు. కాబట్టే రోశయ్య గారిని ముఖ్యమంత్రి చేద్దామంటే ఒప్పుకున్నారు. రఘువీరారెడ్డి, మరికొందరు వచ్చి ఒప్పుకోవద్దని చెప్పారు.

జగన్‌ భవిష్యత్తు, వైఎస్సార్‌సీపీ భవితవ్యంపై మీరేమనుకుంటున్నారు?
విజయమ్మ: ప్రజలు విజ్ఞులు. వారికి అన్నీ తెలుసు. ఈ రోజు వారి కష్టాలను జగన్‌ వింటున్నాడు. అవి తీరుస్తానంటున్నారు. జగన్‌ కూడా తండ్రిలా మంచి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మడం లేదు. వైఎస్‌ కుటుంబం ఒక మాట ఇస్తే చేస్తుందని ప్రజలు నమ్ముతారనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. రాజశేఖరరెడ్డి రక్తం కాబట్టి జగన్‌ చెప్పింది కచ్చితంగా చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందువల్ల తప్పకుండా జగన్‌ ప్రభుత్వం వస్తుందని, వాళ్ల తండ్రి చేసిన పనులను తప్పకుండా చేస్తారని నమ్ముతున్నా.

జగన్‌ పాదయాత్రలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? సలహాలేవైనా ఇచ్చారా?
విజయమ్మ: వాళ్ల నాన్న చనిపోయినప్పటి నుంచి జగన్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడ బాధల్లో ఉన్నా నేనున్నానంటూ వెళ్లడం జగన్‌కు ఉన్న ప్రత్యేక లక్షణం. అతడికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా.

జగన్‌పై కేసులు పెట్టినప్పుడు తల్లిగా మీరు ఎలా ఫీలయ్యారు?
విజయమ్మ: చాలా బాధ కలిగింది. వైఎస్‌ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు సేవ చేశారు. ఆయన తన పేరు ఎక్కడా వాడుకోలేదు. ఎక్కడైనా కార్యకర్తలు రాజశేఖరరెడ్డి జిందాబాద్‌ అంటే రాజీవ్‌ గాంధీ జిందాబాద్‌ అనాలని సూచించేవారు. అంత సేవ చేసిన నాయకుడి కుమారుడిపై కేసులు పెట్టడం బాధ అనిపించింది.

జగన్‌పై పెట్టిన కేసుల్లో పస ఉందనుకుంటున్నారా?
విజయమ్మ: కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం రాజశేఖరరెడ్డి, జగన్‌ మంచివాళ్లు. పార్టీ పెట్టాలని నిర్ణయించడంతోనే కాంగ్రెస్‌ వారికి చెడ్డవాళ్లయిపోయారు. అలా అనుకున్న వారంలోనే నోటీసులు వచ్చాయి, ఆ వెంటనే కేసులు పెట్టారు. ఈ రోజు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆధారాలున్నా ఏమీ చేయడం లేదు. కానీ ఆ రోజు కోర్టుకెవరో లేఖ రాస్తే దాన్ని సీరియస్‌గా తీసుకొని ఈ కేసులన్నీ నడిపించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి కేసులు పెట్టాయి.

ఇలాంటి సమయంలో రాజకీయాలెందుకని బాధపడ్డారా?
విజయమ్మ: చాలా బాధపడ్డాను. జగన్‌కు కూడా చెప్పాను. వాళ్లకు వ్యతిరేకంగా వెళ్తే కష్టపడతావని అన్నాను. అలా అంటే న్యాయం, ధర్మం అనేవాడు. అబద్ధం చెప్పడం జగన్‌కు రాదు. న్యాయంగా వెళ్తూ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అన్నిటికీ దేవుడున్నాడనేది అతడి నమ్మకం. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదంటాడు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. జగన్‌ మాట తప్పే మనిషికాదు. ఒక తల్లిగా అతడి వ్యక్తిత్వం నాకు తెలుసు. మాట ఇస్తే పూర్తిగా కట్టుబడి ఉంటాడు. జగన్‌ను ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశమివ్వండి. జగన్‌ అన్నీ చేస్తాడని మాట ఇస్తున్నా. జగన్‌కు జీవితమే అన్నీ నేర్పిస్తోంది. ఎక్కడ బస్సు, రైలు ప్రమాదం జరిగినా, వరదలొచ్చి ఎవరైనా చనిపోయినా వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను ఓదార్చుతాడు. ప్రయాణాల్లోనే గడుపుతున్నాడు. ఇంట్లో ఉండేది ఎప్పుడని అడిగితే, మన బాధ్యత మనం నెరవేర్చాలి కదమ్మా అంటుంటాడు. వైఎస్సారే మనకు ఆదర్శం. ఆయన ఏనాడూ అబద్ధం ఆడలేదు. ఆయన చెప్పినవి చేశారు. చెప్పనివీ చేశారు. ప్రజల్లో నమ్మకం కలిగించి వెళ్లారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఊహించారా?
విజయమ్మ: ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ను చిన్న వయసులోనే పీసీసీ అధ్యక్షుడిని చేసింది. కాంగ్రెస్‌ నుంచి పెద్ద పెద్ద నాయకులు వెళ్లిపోయారు. అప్పుడు చిన్న వాడిని పీసీసీ అధ్యక్షుడిని చేసినందుకు పెద్ద వారికి కోపం వచ్చింది. సహాయ నిరాకరణ చేశారు. చిన్న మీటింగ్‌ పెట్టాలన్నా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీని పటిష్టం చేశారు. ‘రాజశేఖరరెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్‌ అంటే రాజశేఖరరెడ్డి’ అనే స్థితికి పార్టీని తీసుకొచ్చారు. పదేళ్ల ముందే రాజశేఖరరెడ్డి సీఎం అవుతారనే ప్రచారం సాగింది. రాజకీయాలపై నాకు అంతగా ఆసక్తి లేదు. సీఎం అయ్యాక ఆయన ఇంటికి వచ్చినా మా అందరితో సరదాగా గడిపే వారు తప్ప రాజకీయాల గురించి చెప్పేవారు కాదు.

వైఎస్‌ చేసిన పనుల్లో మీకు బాగా నచ్చినవి?
విజయమ్మ: రాజశేఖరరెడ్డిగారు చేసినవన్నీ మంచి పనులే. ఇప్పుడున్న వాళ్లు రాజశేఖరరెడ్డి పెట్టారని ఏ పథకం తీసేయాలన్నా తీయలేనివే. ఆయన ఎంతో ఆలోచన చేసి పథకాలను ప్రవేశపెట్టారు. ఇంకా ఏం చేయాలా? అని ఎప్పుడూ తపన పడేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారంటే అవన్నీ రాజశేఖరరెడ్డిగారి పుణ్యమే. చంద్రబాబు ఆరోగ్యశ్రీని తీసేయగలరా? ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను తీసేయగలరా? రాజశేఖరరెడ్డి పేరు లేకుండా చేయాలని వాళ్లకు ఉన్నా అలా చేయలేనివి ఆయన పథకాలు.

అప్పుడు వాతావరణం బాగోలేకపోయినా రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు ఎందుకు వెళ్లారు. అధికారులు వద్దన్నారా? అధికారులు వద్దన్నా ఈయన వెళ్లారా? అసలేం జరిగింది?
విజయమ్మ: ఆ రోజు నేను కూడా చెప్పా. వర్షం పడుతోంది, అసెంబ్లీ కూడా అయిపోయింది, ఇప్పుడు వెళ్లకుంటే ఏమవుతుంది? అన్నా. చాలా పనులున్నాయన్నారు. త్వరగా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రాష్ట్రానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి అని తపన పడేవారు. మూడేళ్లలో పోలవరం, ప్రాణహిత సహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామనేవారు. సోనియా గాంధీని కూడా వీటి గురించి అడిగి వచ్చారు. 33 మంది ఎంపీలను గెలిపించి తీసుకొస్తానంటే ఆమెకు నమ్మకం కలగలేదు. పదో, పన్నెండు మందో గెలుస్తారనుకున్నారు. వైఎస్‌ ఒక్కటే చెప్పారు. ఎన్నికలు అయిపోయాక డిసైడ్‌ చేయండమ్మా, మీరు పది 12 సీట్లు అనుకుంటున్నారు, నేను 33 నుంచి 36 మంది ఎంపీలను తీసుకొస్తాను, అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని అన్నారు.

వైఎస్‌ మరణం ఒక కుట్ర అని ప్రచారం జరిగింది. హెలికాప్టర్‌ ప్రమాదమేని అనుకున్నారా?
విజయమ్మ: నాకు కూడా ఏదో జరిగింది అన్న అనుమానం ఉండేది. జగన్‌ను చాలాసార్లు అడిగాను. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే తప్ప ఏం జరిగినా బయటకు రాదమ్మా, రెండు ప్రభుత్వాలు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి బయటకు వచ్చేది ఏమీ ఉండదు అని అన్నాడు.

2014 ఎన్నికల్లో 41 మంది ఎంపీలను గెలిపించుకొచ్చి రాహూల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ నాన్న చెప్పిన మాటను తాను నెరవేరుస్తానన్నాడు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అవుతానని సోనియాగాంధీకి జగన్‌ చెప్పాడు. అప్పుడు పెద్దాయన చనిపోయారనే షాక్‌లోనే మేమున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి కావాలనే ఊహ కూడా మాకు లేదు.

ఎందుకొచ్చిన రాజకీయాలు, ఒకరోజు ఇంటి పట్టున అందరూ కలిసి ఉండే పరిస్థితి లేదు, నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిమీద కాలేసుకుని ఏసీ రూముల్లో ఉండొచ్చని, రాజకీయాలు మనకు వద్దని అప్పట్లోనే జగన్‌కు చెప్పాను. ‘మా నాన్న ఎంతోమంది హృదయాల్లో ఉన్నారు. మా నాన్న ఫొటో ఇంట్లో పెట్టుకునేవారు ఎందరో ఉన్నారు. నాకు అలాంటి జీవితమే ఇష్టమమ్మా’ అని జగన్‌ అన్నాడు. చిన్నప్పుడు జగన్‌ నన్ను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది పెట్టేవాడు కాదు.

జగన్‌ కుమార్తె హర్షకు లండన్‌ స్కూల్‌లో సీటు వచ్చింది కదా, ఎలా ఫీలయ్యారు?
విజయమ్మ: ఆమె చాలా తెలివైనది. ఎక్కడైనా సీటు వస్తుంది. బాగా చదువుతుంది. సబ్జెక్టు పుస్తకాలే కాకుండా నాలెడ్జ్‌ పెరిగే ఇతర పుస్తకాలు కొన్ని వేలు చదివింది.

మీ బాల్యం, చదువు గురించి చెబుతారా?
విజయమ్మ: ఎనిమిదో తరగతి వరకు నేను తాడిపత్రి సమీపంలోని యాడికి దగ్గరి గ్రామంలో మా నాన్నమ్మ దగ్గర పెరిగాను. ఆ తర్వాత పులివెందులకు వచ్చాను. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డితో పెళ్లయ్యింది.

2019 ఎన్నికల్లో మీరు, షర్మిల ప్రచారానికి వెళ్తారా?
విజయమ్మ: 2014లో జగన్‌ లేని సమయంలో నేను, షర్మిల బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్న రాష్ట్రమే.. 13 జిల్లాలే కనుక అంత అవసరం ఉండకపోవచ్చు. అవసరమైతే వెళ్తాం.

ఇంట్లో మీరు ఎలా వ్యవహరిస్తుంటారు?
విజయమ్మ: ఇంట్లో ఉదయం అందరం కలుస్తాం. జగన్‌ వచ్చినప్పుడు కలుస్తాం. పిల్లలతోసహా అందరం కలిసి మాట్లాడుకుంటాం. రాజశేఖరరెడ్డి ఈ అలవాటు మాకు చేశారు.

మీ మనవళ్లకు రాజకీయాలపై ఆసక్తి ఉందా?
విజయమ్మ: చిన్నపిల్లలు కదా? ఇంకా వాళ్లకేమీ తెలియదు. మా కోడలు భారతి నాతో సొంత కూతురిలాగే ఉంటుంది. వాళ్లంతా మాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు.

ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని అనుకుంటున్నారు?
విజయమ్మ: ఎన్ని సమస్యలున్నా దేవుడే అధిగమింపజేస్తాడని అనుకుంటాం. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మనిషికి దేవుడే ఇస్తాడు. జగన్‌కు ఆ ధైర్యం ఉంది. మనమెన్ని మాటలు మాట్లాడినా చివరకు దేవుడికి జవాబుదారీగా ఉండాలి.

ప్రజలకు రాజశేఖరరెడ్డితో మర్చిపోలేని అనుబంధం ఏర్పడింది. జగన్‌ కూడా తండ్రిలాగే జనానికి ఇస్తున్న భరోసా, ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. అయితే తీవ్రంగా కష్టపడుతుండడం వల్ల జ్వరం వచ్చిందని, కాళ్లు బొబ్బలు వచ్చాయని తెలిసినప్పుడు మనసు కలుక్కుమంటోంది.

చంద్రబాబు 1978లో గెలిచాక అప్పట్లో రాజశేఖరరెడ్డికి మిత్రుడట కదా? చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించడంలో రాజశేఖరరెడ్డి పాత్ర ఉందంటారు. నిజమేనా?
విజయమ్మ: అప్పుడు ఎక్కడికి వెళ్లినా వాళ్లు కలిసి వెళ్లేవారు. కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు కలిసి ఉండేవారు. ఇంటికి కూడా బాగా వస్తుండేవారు. అంజయ్య గారితో పోట్లాడి మరీ చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించారు.

రాజశేఖరరెడ్డి, చంద్రబాబు మధ్య తేడాను ఎట్లా పోల్చుతారు.
విజయమ్మ: ఆయనకు, ఈయనకు పోలికే లేదు. నక్కకూ, నాగలోకానికున్నంత తేడా ఉంది. వైఎస్‌తో చంద్రబాబును పోల్చాల్సిన అవసరం కూడా లేదు.

చంద్రబాబు కాకుండా జగన్‌ సీఎం కావాలని ప్రజలు ఎందుకు కోరుకోవాలనుకుంటున్నారు?
విజయమ్మ: ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి. మంచి పనులు చేస్తామనే వారికి కాకుండా వేరేవాళ్లకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు. మంచి చేస్తానంటున్న జగన్‌కే తప్పకుండా ఓటు వేస్తారు. వైఎస్‌ పాలన చూశారు కనుక జగన్‌ పాలన రావాలన్న కోరిక ప్రజల్లో నాకు కనిపిస్తోంది. చంద్రబాబు దగ్గర అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలుంటే, మా దగ్గర ప్రజలున్నారు. వైఎస్‌ ఒక మాట చెప్పేవారు. ప్రజల్లో నిలబడి ఉంటే నాయకులు వాళ్లంతట వాళ్లే వస్తారనేవారు.

జగన్‌ ఇలా రాజకీయాల్లోకి వస్తారని అనుకునేవారా?
విజయమ్మ: 2009లో ఎంపీగా నిలబడాల్సి వచ్చినప్పుడు తాను నిలబడనని జగన్‌ చెప్పాడు. చిన్నాన్నతో పోటీ చేయించండని అన్నాడు. అలా మాట్లాడొద్దు, నా 30 ఏళ్ల అనుభవం నీకు ఉపయోగపడుతుంది, ఎక్కువ మంది ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలుగుతావు అని వైఎస్‌ చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమని భావిస్తున్నారు?
విజయమ్మ: విభజన వల్ల హైదరాబాద్‌ పోయింది కనుక ప్రత్యేక హోదా ఎంతో అవసరం. ఏపీలో పరిశ్రమలు లేవు, ఆసుపత్రులు లేవు. ఏపీకి హైదరాబాద్‌ లాంటి రాజధాని రావాలంటే కష్టమే. మహిళలపై జరుగుతున్న దురాగతాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉంది. ఇక చంద్రబాబు ఏ వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు. నాలుగేళ్లవుతోంది. చంద్రబాబు అసెంబ్లీ కట్టారా? హైకోర్టు కట్టారా? ఆయన ఎవరికి మేలు చేశారు? ఎంతమందికి మేలు చేశారు? తన పేరు గుర్తుండిపోయేలా చంద్రబాబు ఒక్క పనైనా చేశారా? ఏదీ లేదు. ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెబుతారు.

చంద్రబాబు కంటే జగన్‌ మేలు, ఆయనకు ఓటేయాలని ప్రజలకు ఎలా చెప్పగలుగుతారు?
విజయమ్మ: గతంలో వైఎస్‌ ఎంపీల మీటింగ్‌లో చంద్రబాబుకు చెప్పారు. 2000వ సంవత్సరం కంటే ముందు ప్రాజెక్టులు కట్టి ఉంటే నికర జలాలు కేటాయిస్తారు, ప్రాజెక్టులు మొదలు పెట్టు అని బాబుకు సూచించారు. దేవుడు అవకాశం ఇచ్చి 14 ఏళ్ల అధికారంలో ఉన్నా చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయనప్పుడు చరిత్రలో అలాంటి వ్యక్తిని మళ్లీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చాలా డబ్బు ఖర్చు పెడతారంటున్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి మీ పార్టీలో ఉందా? మీ పార్టీ నడుస్తున్న తీరుపై మీరేమంటారు?
విజయమ్మ: అనుభవం కొంతమేర ఉపయోగపడవచ్చేమో గానీ నాయకుడు కావాలనుకొనే వ్యక్తికి మానవత్వం చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే ఏమైనా చేయగలుగుతారు. అది జగన్‌లో ఉంది. చంద్రబాబులో లేదు. అనుభవం అంటున్నారు. దేనిలో చూపించారు. హైకోర్టు కట్టారా? అసెంబ్లీ కట్టారా? ఏం చేశారు?

జగన్‌ను ప్రజలకు అప్పగించానని మీరంటున్నారు. ప్రజలు ఆయనను ఎట్లా చూస్తున్నారు?
విజయమ్మ: ఓదార్పు యాత్రలో జగన్‌ను చూసేందుకు బయటకు రానివారు ఎవ్వరూ లేరు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడూ అంతే. ఎంతో ప్రేమ చూపించారు. వాళ్లకు ఈ కుటుంబం ఎంత రుణపడి ఉందో వారు కూడా అదే విధంగా ప్రేమను చూపిస్తున్నారు. నా బిడ్డ అందరికీ మంచి చేస్తాడు.

చంద్రబాబుకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు. ఇంతకు ముందు తొమ్మిదేళ్లు, ఇప్పుడు ఐదేళ్లు. చంద్రబాబు సద్వినియోగం చేసుకోవడం లేదెందుకో అర్థం కావడం లేదు. రాజశేఖరెడ్డి ఏం చేశారు, ఆయన పోయాక కూడా జనం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారన్న ఆలోచన సైతం చంద్రబాబుకు కలగడం లేదు.

3 Comments

Filed under Uncategorized